భారత్, చైనా మధ్య విమాన కనెక్టివిటీ తిరిగి ప్రారంభం కానుంది. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ నవంబర్ 9 నుంచి షాంఘై, న్యూఢిల్లీ మధ్య రౌండ్-ట్రిప్ విమానాలను ప్రారంభించనుంది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరిచే దిశగా ఒక కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. షాంఘై, ఢిల్లీ మధ్య ప్రతి బుధ, శని, ఆదివారాల్లో ఈ విమానం నడుస్తుందని ఎయిర్లైన్స్ తెలిపింది. ఈ విమానం షాంఘైలోని పుడాంగ్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి సాయంత్రం…
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన ఎయిర్పోర్టు నిర్మాణానికి పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన (IAF) అంగీకరించింది. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు రావడంపై జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిగణలోకి తీసుకుంది.
Warangal Airport: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూరులో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న కసరత్తులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామునూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రతిపాదనలు పంపగా, తాజాగా కేంద్రం దీనికి అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు మరింత పెరగనున్నాయి. విమాన ప్రయాణాల విస్తరణ, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధికి మామునూరు ఎయిర్పోర్ట్…
Maha Kumbh Mela 2025: మహా కుంభం నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు విమాన ప్రయాణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీనితో టిక్కెట్ ధరలు గణనీయంగా పెరగడంతో, విమానయాన సంస్థలకు విమాన ఛార్జీలను హేతుబద్ధం చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించింది. ప్రయాగ్రాజ్ (Prayagraj)కు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్పైస్జెట్ (Spicejet) వంటి విమానయాన సంస్థలు ప్రయాగ్రాజ్కు మరిన్ని విమానాలను నడుపుతున్నాయి. జనవరి నెలలో ప్రయాగ్రాజ్కి విమాన…
Air Travel: విమాన ప్రయాణాన్ని క్రమబద్ధీకరించాడనికి, భద్రత చర్యలను కఠినతరం చేయడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) కఠినమైన ‘‘లగేజ్’’ నిబంధనల్ని తీసుకువచ్చింది. ఇప్పుడు విమానాల్లో హ్యాండ్ లగేజీ లేదా హ్యాండ్ బ్యాగ్ని తీసుకెళ్లడానికి పరిమితుల్ని విధించింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల్లో ప్రయాణికులు విమానంలో ఒక క్యాబిన్ బ్యాగ్ లేదా హ్యాండ్ బ్యాగ్ని తీసుకెళ్లడానికి పరిమితం చేయనున్నారు. విమానాశ్రయాల్లో నానాటికి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను నిర్వహించడంతో పాటు ఆపరేషనల్ ఎఫిషియెన్సీని పంచడానికి ప్రభుత్వం ఈ…
Jet Fuel : జూలై నుండి అక్టోబర్ వరకు వరుసగా నాలుగు నెలల పాటు జెట్ ఇంధనం భారీగా పెరిగింది. ఎయిర్ టర్బైన్ ఇంధనాన్ని చమురు కంపెనీలు వరుసగా రెండవ నెల కూడా తగ్గించడంతో ఎయిర్లైన్ కంపెనీలకు ఉపశమనం లభించింది.
ATF Price Hike: కొత్త నెల ప్రారంభం అయింది. ప్రతి నెల ప్రారంభంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సర్వ సాధారణం. అదే విధంగా సెప్టెంబర్ 1 నుండి, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరలో భారీ పెరుగుదల కనిపించింది.
ఇప్పటి వరకు, విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాస్కులు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించడం తప్పనిసరి.. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. ఎందుకంటే.. విమాన ప్రయాణంలో మాస్క్ల వాడకం తప్పనిసరి కాదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.. అయితే, కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ప్రయాణికులు వాటిని ఉపయోగించడమే బెటర్ అనే సందేశాన్ని మాత్రం ఇచ్చింది. కాగా, కరోనా ఎంట్రీ తర్వాత.. కనిపించమని ఆ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు విమానాలతో పాటు.. పబ్లిక్ ప్లేస్లలోనూ…
విమాన ప్రయాణికులకు షాక్ తగిలింది. దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్ 1 నుంచి 13-16 శాతం పెంచుతూ పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ.2,300 నుంచి రూ.2,600లకు పెరుగగా, 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం ఉన్న రూ. 2,900 నుంచి రూ.3,300కి పెంచింది. 60-90 నిమిషాల ప్రయాణానికి…