Masks no more compulsory: ఊపిరి పీల్చుకోండి.. ఇక మాస్క్ తప్పనిసరి కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు, విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాస్కులు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించడం తప్పనిసరి.. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. ఎందుకంటే.. విమాన ప్రయాణంలో మాస్క్ల వాడకం తప్పనిసరి కాదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.. అయితే, కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ప్రయాణికులు వాటిని ఉపయోగించడమే బెటర్ అనే సందేశాన్ని మాత్రం ఇచ్చింది. కాగా, కరోనా ఎంట్రీ తర్వాత.. కనిపించమని ఆ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు విమానాలతో పాటు.. పబ్లిక్ ప్లేస్లలోనూ మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. అయినా.. చాలా మంది ధరించారు.. కొంతమంది ధరించకపోవడంతో ఫైన్ తప్పలేదు.. ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత కొందరు అలవాటుపడినవారు మాస్క్ ధరిస్తూనే ఉన్నారు.. కానీ, చాలా మంది వాటికి దూరంగానే ఉంటున్నారు.
Read Also: Holidays in 2023: 2023లో సెలవులు ఇవే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
అయితే, విమానాల్లో పరిస్థితి వేరుగా ఉంది.. ఇప్పటి వరకు, విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాస్కులు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించడం తప్పనిసరి కాగా.. ఇక, తప్పనిసరి కాదంటోంది కేంద్రం.. షెడ్యూల్ చేయబడిన ఎయిర్లైన్స్కు కమ్యూనికేషన్లో, కోవిడ్ 19 నిర్వహణ ప్రతిస్పందనకు గ్రేడెడ్ విధానం యొక్క ప్రభుత్వ విధానానికి అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రా విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకపై విమానంలో కోవిడ్ 19 వల్ల కలిగే ముప్పు దృష్ట్యా, ప్రయాణీకులందరూ మాస్క్/ఫేస్ కవర్లను ఉపయోగించాలని మాత్రమే పేర్కొంది. విమానంలో ప్రకటనల భాగంగా జరిమానా/శిక్ష చర్యలకు సంబంధించిన ఏదైనా నిర్దిష్ట సూచనలు చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. తాజా అధికారిక డేటా ప్రకారం, దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కోవిడ్ కేసుల్లో 0.02 శాతంగా మాత్రమే ఉన్నాయి.. ఇక, రికవరీ రేటు 98.79 శాతానికి పెరిగింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,28,580కి పెరిగింది.. మరణాల రేటు ఇప్పటి వరకు 1.19 శాతంగా నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!