Masks no more compulsory: ఊపిరి పీల్చుకోండి.. ఇక మాస్క్ తప్పనిసరి కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు, విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాస్కులు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించడం తప్పనిసరి.. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. ఎందుకంటే.. విమాన ప్రయాణంలో మాస్క్ల వాడకం తప్పనిసరి కాదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.. అయితే, కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ప్రయాణికులు వాటిని ఉపయోగించడమే బెటర్ అనే సందేశాన్ని మాత్రం ఇచ్చింది. కాగా, కరోనా ఎంట్రీ తర్వాత.. కనిపించమని ఆ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు విమానాలతో పాటు.. పబ్లిక్ ప్లేస్లలోనూ మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. అయినా.. చాలా మంది ధరించారు.. కొంతమంది ధరించకపోవడంతో ఫైన్ తప్పలేదు.. ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత కొందరు అలవాటుపడినవారు మాస్క్ ధరిస్తూనే ఉన్నారు.. కానీ, చాలా మంది వాటికి దూరంగానే ఉంటున్నారు.
Read Also: Holidays in 2023: 2023లో సెలవులు ఇవే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
అయితే, విమానాల్లో పరిస్థితి వేరుగా ఉంది.. ఇప్పటి వరకు, విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాస్కులు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించడం తప్పనిసరి కాగా.. ఇక, తప్పనిసరి కాదంటోంది కేంద్రం.. షెడ్యూల్ చేయబడిన ఎయిర్లైన్స్కు కమ్యూనికేషన్లో, కోవిడ్ 19 నిర్వహణ ప్రతిస్పందనకు గ్రేడెడ్ విధానం యొక్క ప్రభుత్వ విధానానికి అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రా విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకపై విమానంలో కోవిడ్ 19 వల్ల కలిగే ముప్పు దృష్ట్యా, ప్రయాణీకులందరూ మాస్క్/ఫేస్ కవర్లను ఉపయోగించాలని మాత్రమే పేర్కొంది. విమానంలో ప్రకటనల భాగంగా జరిమానా/శిక్ష చర్యలకు సంబంధించిన ఏదైనా నిర్దిష్ట సూచనలు చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. తాజా అధికారిక డేటా ప్రకారం, దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కోవిడ్ కేసుల్లో 0.02 శాతంగా మాత్రమే ఉన్నాయి.. ఇక, రికవరీ రేటు 98.79 శాతానికి పెరిగింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,28,580కి పెరిగింది.. మరణాల రేటు ఇప్పటి వరకు 1.19 శాతంగా నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..