Pakistan-Bangladesh: దివాళా దేశాల మధ్య విమాన సర్వీసులు.. భారత్ అనుమతించిందా?
- పాక్ బంగ్లాల మధ్య బలపడుతున్న సంబంధాలు..
- దశాబ్ధాల తర్వాత ఢాకా-కరాచీ మధ్య డైరెక్ట్ ఫ్లైట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Bangladesh: దివాళా దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ జనవరి 29 నుంచి ఢాకా-కరాచీల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుల్ని ప్రారంభించనుంది. దశాబ్ధానికి పైగా రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు లేవు. గతేడాది షేక్ హసీనాను పదవి నుంచి దించేసిన తర్వాత, మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పెరిగాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకత, హిందువులపై దాడులు పెరిగాయి.
Read Also: Krishna: బెజవాడ నడిబొడ్డున కృష్ణ విగ్రహం..ఆవిష్కరించనున్న కొత్త ఘట్టమనేని హీరో
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
ఇదిలా ఉంటే, ఈ రెండు దేశాలు తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ఉద్దేశంతో నేరుగా విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించుకున్నాయి. మొదటగా వారానికి రెండుసార్లు గురువారం, శనివారాల్లో నడుస్తాయి. ఢాకా-కరాచీ మధ్య విమానాలను ప్రారంభించడానికి పాకిస్తాన్ నియంత్రణ సంస్థలతో చాలా నెలలుగా చర్చలు జరుగుతున్నట్లు బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ వెల్లడించింది.
ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం, రాత్రి 8 గంటలకు ఢాకా నుంచి బయలుదేరి రాత్రి 11.00 గంటలకు ఢాకా చేరుకుంటుంది. తిరిగి రాత్రి 12 గంటల నుంచి కరాచీ నుంచి బయలుదేరి ఉదయం 4.20 గంటలకు ఢాకా చేరుకుంటుంది. అయితే, ఢాకా నుంచి కరాచీ వెళ్లాలంటే భారత్ గగనతలాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రెండు నగరాల మధ్య దూరం 2370 కి.మీ అయితే, భారత్ నుంచి బంగ్లాదేశ్ క్లియరెన్స్ పొందిందో లేదో ఇంకా తెలియలేదు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!