Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా నేపథ్యంలో విమాన ఛార్జీల నియంత్రణపై డీజీసీఏ చర్యలు
- మహా కుంభం నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు విమాన ప్రయాణానికి భారీగా డిమాండ్.
- ధరల నియంత్రణకై రంగంలోకి దిగిన DGCA
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: మహా కుంభం నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు విమాన ప్రయాణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీనితో టిక్కెట్ ధరలు గణనీయంగా పెరగడంతో, విమానయాన సంస్థలకు విమాన ఛార్జీలను హేతుబద్ధం చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించింది. ప్రయాగ్రాజ్ (Prayagraj)కు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్పైస్జెట్ (Spicejet) వంటి విమానయాన సంస్థలు ప్రయాగ్రాజ్కు మరిన్ని విమానాలను నడుపుతున్నాయి. జనవరి నెలలో ప్రయాగ్రాజ్కి విమాన కనెక్టివిటీని మెరుగుపరచడానికి డీజీసీఏ 81 అదనపు విమానాలను ఆమోదించింది. దీంతో మొత్తం 132 విమానాలు దేశవ్యాప్తంగా ప్రయాగ్రాజ్ను కనెక్ట్ చేస్తున్నాయి.
Also Read: Google Doodle: గణతంత్ర దినోత్సవ సందర్బంగా ‘వైల్డ్లైఫ్ మీట్స్ కల్చర్’ డూడుల్తో అదరగొట్టిన గూగుల్
Also Read
- Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టిక్కెట్ ధరలను (ticket prices) నియంత్రించేందుకు జనవరి 23న డీజీసీఏ అధికారులు విమానయాన సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రెగ్యులేటర్, సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా, మరిన్ని విమానాలను జోడించడం, టిక్కెట్ ధరలను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. నివేదిక ప్రకారం, ఇటీవల ఢిల్లీ-ప్రయాగ్రాజ్ విమాన టిక్కెట్ ధరలు 21 శాతం వరకు పెరిగాయి. మహా కుంభం ప్రారంభమైన జనవరి 13నుంచి, ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు, పర్యాటకులు పాల్గొంటుండడంతో ప్రయాగ్రాజ్కు విమాన బుకింగ్స్ అనేక రెట్లు పెరిగాయి. ఈ చర్యల ద్వారా విమాన ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రయాణికులపై పడే ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడాలని డీజీసీఏ ఆశిస్తోంది.
Also Read: Chennai Airport: బాంబు పేల్చేస్తామంటూ బెదిరింపులు.. చెన్నై ఎయిర్పోర్టులో హై టెన్షన్!
ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా పర్వం హిందువుల సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమంలో జరిగే ఈ ఘట్టానికి దేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ వేడుక కోసం ప్రయాగ్రాజ్ నగరంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహా కుంభం దృష్ట్యా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు డీజీసీఏ తీసుకుంటున్న చర్యలు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తాయని భావిస్తున్నారు.
To meet increased demand for air travel to Prayag Raj during Mahakumbh, DGCA has approved 81 additional flights in January, raising Prayagraj connectivity to 132 flights from across India.
— DGCA (@DGCAIndia) January 25, 2025
తాజావార్తలు
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?