Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా నేపథ్యంలో విమాన ఛార్జీల నియంత్రణపై డీజీసీఏ చర్యలు
- మహా కుంభం నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు విమాన ప్రయాణానికి భారీగా డిమాండ్.
- ధరల నియంత్రణకై రంగంలోకి దిగిన DGCA
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: మహా కుంభం నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు విమాన ప్రయాణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీనితో టిక్కెట్ ధరలు గణనీయంగా పెరగడంతో, విమానయాన సంస్థలకు విమాన ఛార్జీలను హేతుబద్ధం చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించింది. ప్రయాగ్రాజ్ (Prayagraj)కు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్పైస్జెట్ (Spicejet) వంటి విమానయాన సంస్థలు ప్రయాగ్రాజ్కు మరిన్ని విమానాలను నడుపుతున్నాయి. జనవరి నెలలో ప్రయాగ్రాజ్కి విమాన కనెక్టివిటీని మెరుగుపరచడానికి డీజీసీఏ 81 అదనపు విమానాలను ఆమోదించింది. దీంతో మొత్తం 132 విమానాలు దేశవ్యాప్తంగా ప్రయాగ్రాజ్ను కనెక్ట్ చేస్తున్నాయి.
Also Read: Google Doodle: గణతంత్ర దినోత్సవ సందర్బంగా ‘వైల్డ్లైఫ్ మీట్స్ కల్చర్’ డూడుల్తో అదరగొట్టిన గూగుల్
Also Read
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టిక్కెట్ ధరలను (ticket prices) నియంత్రించేందుకు జనవరి 23న డీజీసీఏ అధికారులు విమానయాన సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రెగ్యులేటర్, సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా, మరిన్ని విమానాలను జోడించడం, టిక్కెట్ ధరలను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. నివేదిక ప్రకారం, ఇటీవల ఢిల్లీ-ప్రయాగ్రాజ్ విమాన టిక్కెట్ ధరలు 21 శాతం వరకు పెరిగాయి. మహా కుంభం ప్రారంభమైన జనవరి 13నుంచి, ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు, పర్యాటకులు పాల్గొంటుండడంతో ప్రయాగ్రాజ్కు విమాన బుకింగ్స్ అనేక రెట్లు పెరిగాయి. ఈ చర్యల ద్వారా విమాన ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రయాణికులపై పడే ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడాలని డీజీసీఏ ఆశిస్తోంది.
Also Read: Chennai Airport: బాంబు పేల్చేస్తామంటూ బెదిరింపులు.. చెన్నై ఎయిర్పోర్టులో హై టెన్షన్!
ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా పర్వం హిందువుల సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమంలో జరిగే ఈ ఘట్టానికి దేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ వేడుక కోసం ప్రయాగ్రాజ్ నగరంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహా కుంభం దృష్ట్యా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు డీజీసీఏ తీసుకుంటున్న చర్యలు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తాయని భావిస్తున్నారు.
To meet increased demand for air travel to Prayag Raj during Mahakumbh, DGCA has approved 81 additional flights in January, raising Prayagraj connectivity to 132 flights from across India.
— DGCA (@DGCAIndia) January 25, 2025
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..