తను ఇచ్చిన ఆర్డర్లో నచ్చిన ఐటం రాకపోవడంతో మొదలైన గొడవ.. చివరకు హోటల్ యజమానిపై దాడి, హోటల్ ధ్వంసానికి దారి తీసింది.. ఈ ఘటన తమిళనాడులోని అంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూర్ జిల్లాలోని అంబూర్లో మొహమ్మద్ సర్ధార్కి చెందిన స్టార్ బిర్యానీ సెంటర్ ఉంది… ఆ హోటల్కు వెళ్లిన అన్నాడీఎంకే, కాంగ్రెస్ నేతలు… భోజనం ఆర్డర్ ఇచ్చారు.. అయితే, అందులో రావాల్సిన సేమియా ఫ్రై రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన…
తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి తరువాత, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని, అభివృద్దికి డిఎంకే ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. అయితే, అన్నాడిఎంకే పార్టీ ఓటమిపై మాజీనేత శశికళ కీలక వ్యాఖ్యలు చేసింది. తాను జైలు నుంచి విడుదలయ్యి బయటకు వచ్చిన సమయంలో విజయం కోసం కలిసి పనిచేద్దామని చెప్పానని, కానీ, పార్టీనేతలు పట్టించుకోలేదని, కలిపి పనిచేసి ఉంటే అమ్మ ప్రభుత్వం అధికారంలోనే ఉండేదని అన్నారు. Read: కమల్…
తమిళనాడు రాజకీయాల్లో శశికళ ఎప్పుడు చక్రం తిప్పుదామని ప్రయత్నాలు చేసినా.. ఆమెకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. జయలలిత నిచ్చెళిగా గుర్తింపు పొందిన ఆమె.. జయ కన్నుమూసిన తర్వాత.. అన్నా డీఎంకేలో కీలక బాధ్యతలు చేపట్టారు.. క్రమంగా సీఎం చైర్ ఎక్కాలని ప్రయత్నాలు చేసినా.. కేసుల్లో ఇరుక్కుపోయి జైలుపాలయ్యారు.. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలైన ఆమెకు తమిళనాడులో భారీ స్వాగతమే లభించింది.. తన కారులో జయలలిత ఫొటో పెట్టుకుని దర్శనమిచ్చారు. ఎన్నికల ముందు…