Tamilnadu: బీజేపీకి షాక్.. ఏఐఏడీఎంకేలో చేరిన కమలం నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడులో బీజేపీకి షాక్ తగిలింది. చెన్నై వెస్ట్ బీజేపీ ఐటీ వింగ్కు చెందిన 13 మంది నేతలు పార్టీకీ రాజీనామా చేశారు.వారం క్రితం తమిళనాడు బీజేపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు నిర్మల్ కుమార్, దిలీప్ కన్నన్ పార్టీకి రాజీనామా చేసి ఏఐఏడీఎంకేలో చేరిన అనంతరం డజన్ల కొద్దీ కాషాయ పార్టీ కార్యకర్తలు దీనిని అనుసరించారు. పార్టీలో జరుగుతున్న పరిమాణాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు.
చెన్నై వెస్ట్లోని బీజేపీ ఐటి విభాగానికి చెందిన 13 మంది బీజేపీ కార్యకర్తలు బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం అన్నాడీఎంకేలో చేరిన సీటీఆర్ నిర్మల్ కుమార్ బాటలో నడుస్తామని చెప్పారు. సీటీఆర్ నిర్మల్ కుమార్ గతంలో బీజేపీ ఐటీ విభాగం అధిపతిగా ఉన్నారు. మరోవైపు ట్యూటికోరిన్లో బీజేపీ జిల్లా స్థాయి ఓబీసీ మోర్చా కార్యకర్త గోమతి బుధవారం ఉదయం అన్నాడీఎంకేలో చేరారు. ఆమెను అన్నాడీఎంకే సీనియర్ నేత కదంబూర్ రాజు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ కార్యకర్తలు పార్టీని విడిచిపెట్టి, ఏఐఏడీఎంకేలో చేరారు.
Also Read
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
Read Also: Nama Nageswara Rao : కవితను ఈడీ విచారణకు రావాలని ఆదేశించడం కక్ష సాధింపు
మంగళవారం, బీజేపీ ఐటీ విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కన్నన్ పార్టీని విడిచిపెట్టిన అనంతరం బీజేపీకి చెందిన మహిళా కార్యకర్త సహా మరో ముగ్గురు, దాని ఏఐఏడీఎంకే తాత్కాలిక చీఫ్ కె.పళనిస్వామి సమక్షంలో పార్టీలో చేరారు. మిత్రపక్షమైన అన్నాడీఎంకే తమ పార్టీ కార్యకర్తలను వేటాడిందని తమిళనాడు బీజేపీ ఆరోపించింది. ఇదిలావుండగా.. తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలను వేటాడుతోందని ఆరోపించారు. అన్నామలై ఏఐఏడీఎంకేకి హెచ్చరిక జారీ చేశారు. తాను వేటాడాలని నిర్ణయించుకుంటే జాబితా చాలా పెద్దదిగా ఉంటుందని హెచ్చరించారు. తమిళనాడులో బీజేపీ పెరిగిందని ఇది తెలియజేస్తోందని కె.అన్నామలై అన్నారు. మనం ఇతర ద్రావిడ పార్టీల నుంచి నాయకులను వేటాడి బీజేపీ ఎదగడానికి సహాయం చేయాల్సిన సమయం ఉందన్నారు. ఇప్పుడు కొన్ని ద్రావిడ పార్టీలు ఎదగాలంటే, వారు బీజేపీ నుంచి నాయకులను వేటాడాలని కె.అన్నామలై అన్నారు.
తాజావార్తలు
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!