Tamil Nadu: అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు.. పొత్తు సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో అన్నాడీఎంకే, దాని మిత్ర పక్షం బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పొత్తు ఉంటుందా? లేదా ? అన్నది ఆసక్తి రేపుతోంది. ఐదుగురు బీజేపీ నేతలు అన్నా డీఎంకేలో చేరడంతో మొదలైన వివాదం ముదిరింది. ఒకేసారి 13 మంది బీజేపీ నేతలు పార్టీ వీడటం రాజకీయంగా హాట్ టాఫిక్ గా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. తీరు నచ్చక ఆ పార్టీ నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమి మధ్య చీలిక వచ్చింది. దీంతో అన్నాడీఎంకే పై అన్నమలై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
2019లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాయి. దాదాపు మూడు ఎన్నికల్లో కలిసే పోటీ చేసినా ఓటమి తప్పలేదు. మొత్తం 234 సీట్లున్న తమిళనాడులో బీజేపీకి నాలుగు స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల ఐటి వింగ్ చీఫ్ సిఆర్టి నిర్మల్ కుమార్తో సహా అనేక మంది బిజెపికి చెందిన నేతలు ఎఐఎడిఎంకెలో చేరారు. దీంతో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఏఐఏడీఎంకే ‘సంకీర్ణ ధర్మాన్ని’ ఉల్లంఘిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. అంతేకాదు అన్నాడీఎంకే అధినేత ఇ పళనిస్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
Read Also: Delhi: ఢిల్లీ కేబినెట్లో చేరిన ఇద్దరు కొత్త మంత్రులు
అయితే, బీజేపీ నేతల చర్యలను అన్నాడీఎంకే ఖండించింది. రాజకీయ నాయకులు పార్టీలు మారడం సాధారణమని పేర్కొంది. గతంలో మాజీ మంత్రి నైనార్ నాగేంద్రన్తో సహా పలువురు సీనియర్ నాయకులు బిజెపిలో ఎలా చేరారో ఉదహరించారు. అయితే, ఈ చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తామని మాజీ మంత్రి డి జయకుమార్ తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే ఎన్డీఏకు సారథ్యం వహిస్తుందని డి జయకుమార్ చెప్పారు.
ఎఐఎడిఎంకె శిబిరంలో మాజీ సీఎంలు పళనిస్వామి, ఓ పన్నీర్సెల్వం మధ్య ఆధిపత్యం కోసం గొడవ జరిగింది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత, అన్నాడీఎంకే మూడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీ చేసి ఓడిపోయింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూటమి ఓడిపోవడంతో పార్టీలు కలిసి ప్రచారం కూడా చేయలేదు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, పార్టీ తన పాదముద్రను విస్తరించడానికి దూకుడుగా ప్రయత్నిస్తోందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
- Tags
- AIADMK
- bjp
- D Jayakumar
- NDA
- Tamil Nadu
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!