AIADMK: ఏఐఏడీఎంకే అధికార పోరులో పళనిస్వామికి కోర్టులో భారీ ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIADMK: ఏఐఏడీఎంకే నేత ఇ.పళనిస్వామికి మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియామకం చెల్లదని హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. పళనిస్వామితో తీవ్ర అధికార పోరులో చిక్కుకున్న ఓ పన్నీర్సెల్వంకు ఈ తీర్పు తీపికబురుగా మారింది. పార్టీ నాయకత్వం విషయంలో జూన్ 23కి ముందు ఉన్న స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంటే పన్నీర్సెల్వం సమన్వయకర్తగా, పళనిస్వామి డిప్యూటీగా పార్టీ ఉమ్మడి నాయకత్వంలో ఉంటుందని దీని అర్థం. పళనిస్వామి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జనరల్ కౌన్సిల్ సమావేశం చట్టవిరుద్ధమని పన్నీర్ సెల్వం కోర్టు ముందు వాదించారు. ఈ సమావేశాన్ని పళనిస్వామి ఏర్పాటు చేశారని.. అటువంటి సమావేశాన్ని ఉమ్మడిగా ఏర్పాటు చేయాలని చెప్పిన పార్టీ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన వాదించారు.”తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి నియామకం అసంబద్ధం అవుతుంది. ఇద్దరు నాయకులు కలిసి పని చేయాలి.” అని పన్నీర్సెల్వం తరఫు న్యాయవాది తమిళమారన్ వెల్లడించారు.
ఇటీవల జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఓపీఎస్ను పార్టీ నుంచి బహిష్కరించడంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం వర్గం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు జూలై 29న మద్రాసు హైకోర్టుకు పంపింది.ఈ కేసుపై మూడు వారాల్లోగా తీర్పు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టును ఆదేశించింది. పార్టీ వ్యవహారాలకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని అన్నాడీఎంకేలోని ఓపీఎస్, ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) వర్గాలను కూడా కోరింది. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కావాలన్న డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం చుట్టూ వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
జూలై 11న జరిగిన దాని జనరల్ కౌన్సిల్ సమావేశంలో, అన్నాడీఎంకేలో ద్వంద్వ-నాయకత్వం ముగిసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పన్నీర్సెల్వం పార్టీ నుంచి బహిష్కరించబడ్డాడు. ఈ సమావేశంలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని నియమించారు. అన్నాడీఎంకేను చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం పోటీ పడ్డారు. చివరకు అన్నాడీఎంకేలోని ఈ.పళనిస్వామి వర్గం నేతలు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. అలాగే, కో-ఆర్డినేటర్, జాయింట్ కో-ఆర్డినేటర్ పదవులను తొలగించారు. పళనిస్వామి వర్గం తీసుకొచ్చిన మొత్తం 16 తీర్మానాలను ఆమోదించారు. అయితే, అందులో చట్టబద్ధత లేదని పన్నీర్ సెల్వం వర్గం కోర్టును ఆశ్రయించింది.
TRS Party: వరుస ఎన్నికల నేపథ్యంలో.. సోషల్ మీడియా వింగ్ని బలోపేతం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ
గతంలో దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కోర్టు శిక్షల నేపథ్యంలో పదవీవిరమణ చేయాల్సి వచ్చినప్పుడు రెండుసార్లు పన్నీర్సెల్వంను అత్యున్నత పదవికి ఎంపిక చేశారు. జయలలిత మరణానికి ముందు ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆమె మరణానంతరం కొద్దికాలం పాటు పార్టీని నడిపించిన ఆమె సన్నిహితురాలు శశికళ ముఖ్యమంత్రి పీఠానికి పళనిస్వామిని ఎంపిక చేశారు. జయలలిత ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లే ముందు శశికళ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నించడంతో పన్నీర్సెల్వం గతంలో తిరుగుబాటు చేశారు.
శశికళ బెంగళూరు జైలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పళనిస్వామి పన్నీర్స్వామితో కలిసి ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇద్దరు నాయకులూ ద్వంద్వ నాయకత్వ నమూనాను రూపొందించారు. దీని ప్రకారం పన్నీర్సెల్వం ప్రభుత్వంలో పళనిస్వామి డిప్యూటీ అయ్యారు. పార్టీలో పన్నీర్సెల్వం సమన్వయకర్తగా, పళనిస్వామి జాయింట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఉమ్మడి నాయకత్వంలో, అన్నాడీఎంకే వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. పార్టీ నాయకత్వాన్ని చేపట్టే ప్రయత్నంలో ద్వంద్వ నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం కష్టమని పళనిస్వామి వాదించారు. మద్రాసు హైకోర్టు ఉత్తర్వు పన్నీర్సెల్వానికి సకాలంలో ఉపశమనం కలిగించినప్పటికీ, ఆయనను బహిష్కరించిన పార్టీ జనరల్ కౌన్సిల్ మద్దతును గెలుచుకోవడం ఇప్పటికీ సవాల్తో కూడుకునే పనే.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!