ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'మరువతరమా' నుండి ఫస్ట్ సింగిల్ 'పాదం పరుగులు తీసే....' ఇటీవల విడుదలైంది. విజయ్ బుల్గనిన్ స్వరపరిచిన ఈ గీతానికి చైతన్య వర్మ సాహిత్యాన్ని సమకూర్చారు.
విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందిస్తున్న 'మరువతరమా' చిత్రంలోని తొలి గీతం ఈ నెల 5న విడుదల కాబోతోంది. అద్వైత్ ధనుంజయ, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చైతన్యవర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు.