అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టం కింద పలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ మాత్రమే సవాలు చేయగలదని, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆదివారం అన్నారు.
అక్టోబర్ 30వ తేదీన గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన దుర్ఘటనలో దాదాపు 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీతో హిమాచల్ ప్రదేశ్లో రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ తన పది పాయింట్ల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి.
గుజరాత్ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలగితే దర్యాప్తులో చిక్కుకున్న మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లను విడిచిపెడతామని బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన రోజుల వ్యవధిలోని అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
గుజరాత్లో ఎన్నికల తేదీలు ప్రకటించిన వేళ పలు పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు.
ఆర్థిక నేరస్థుడు, రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్ బలవంతంగా తన నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారని ఆరోపించాడు.
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీపై గెలిచేందుకు ఆప్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆప్ కన్వీనర్ గుజరాత్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.