Sukesh Chandrashekar: ఆప్పై సీబీఐ విచారణ జరిపించాలి.. సుఖేష్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukesh Chandrashekar: అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టం కింద పలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఇంతకు ముందే ఓ లేఖను విడుదల చేయగా మరో లేఖను సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేశారు. ఢిల్లీ సీఎం పంజాబ్, గోవా ఎన్నికల కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు సుఖేష్ తన రెండో లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలను ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు పంపించినట్లు తెలుస్తోంది. గోవా, పంజాబ్ ఎన్నికల కోసం ఆమ్ ఆదామీ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్ ఆ పార్టీకి డబ్బులు చెల్లించాలని అడిగారని కూడా ఆయన ఆరోపించారు.
కానీ తాను వాటిని పట్టించుకోకుండా నిశ్శబ్ధంగా ఉన్నానని.. కానీ జైలు పరపాలన అధికారుల ద్వారా నిరంతరం బెదిరింపులు కొనసాగాయని సుఖేష్ లేఖలో వెల్లడించారు. తాను అబద్ధాలు చెబుతున్నానని ఆప్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన సుకేష్ చంద్రశేఖర్, తాను అబద్ధాలు చెబుతున్నట్లయితే, జైలు యంత్రాంగం తనపై ఎందుకు ఒత్తిడి తెస్తోందని లేదా గతంలో చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు. కేజ్రీవాల్, మాజీ డీజీ సందీప్ గోయల్, జైలు పరిపాలనపై హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని సత్యేందర్ జైన్ నిరంతరం తనను ఎందుకు అడిగారని లేఖలో తెలిపారు. ఎన్నికల ప్రచారానికి ఎక్కువ నిధులు ఇవ్వమని అడగడమే కాకుండా తను నిరంతరం బెదిరించారన్నారు. ఆప్ నేతల తప్పు లేకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అని తన లేఖలో పేర్కొన్నాడు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలకు ముందు బీజేపీ ఆదేశానుసారం పార్టీ, దాని నాయకుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆప్ నాయకుల ఆరోపణలను చంద్రశేఖర్ తోసిపుచ్చారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మరో లేఖ రాశారు. ఢిల్లీ ఎల్జీకి తన తాజా లేఖలో చంద్రశేఖర్ ఇలా రాశారు. ఆప్కు సంబంధించిన నిజాలు బయటికి రాకముందే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున, అత్యవసరంగా సీబీఐ దర్యాప్తును ఆదేశించాలని,ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి తనను అనుమతించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ ఎల్జీకి తాను చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఆప్ నేత సత్యేందర్ జైన్, తీహార్ జైలు మాజీ డీజీ (జైళ్లు) తనను బెదిరిస్తున్నారని సుఖేష్ ఆరోపించారు. తనకు జైన్, మాజీ డీజీ నుంచి తీవ్రమైన ముప్పు ఉందని లేఖలో చెప్పాడు.
Bhopal: బాబోయ్ వీళ్లు లేడీలా రౌడీలా.. నడిరోడ్డుపై ఏంటీ దారుణం
ఇదిలా ఉండగా.. గతంలో కూడా రెండు సార్లు సుఖేష్ లేఖలు రాశాడు. తన రెండో లేఖలో రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్ బలవంతంగా తన నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారని ఆరోపించాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చిన ఆరోపణలు చేయడం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టించింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుకేశ్ లేఖ రాశాడు. తనను జైలులో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తనకు రక్షణ కల్పించేందుకు జైలులోనే ఉన్న సత్యేంద్ర జైన్కు రక్షణ కోసం డబ్బులు ఇచ్చానని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.50 కోట్లకు పైగా సుకేష్ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో రాజ్యసభ నామినేషన్ కోసం రూ.50 కోట్లు తీసుకుందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒక మోసాల పార్టీ అంటూ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు సుకేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. బీజేపీ కావాలనే ఇలాంటి కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు.
I request you to direct an urgent CBI investigation & allow me to file FIR as the pressure is getting too much& any undue event may take place before the truth about AAP is exposed: Conman Sukesh Chandrashekhar in a letter written to Delhi LG that has been confirmed by his lawyer pic.twitter.com/IaxikFrNk6
— ANI (@ANI) November 7, 2022
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!