Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Sukesh Chandrashekhar Writes Another Letter To Delhi Lg Vk Saxena

Sukesh Chandrashekar: ఆప్‌పై సీబీఐ విచారణ జరిపించాలి.. సుఖేష్‌ చంద్రశేఖర్‌ తీవ్ర ఆరోపణలు

Published Date :November 8, 2022 , 11:18 am
By Mahesh Jakki
Sukesh Chandrashekar: ఆప్‌పై సీబీఐ విచారణ జరిపించాలి.. సుఖేష్‌ చంద్రశేఖర్‌ తీవ్ర ఆరోపణలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sukesh Chandrashekar: అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టం కింద పలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఇంతకు ముందే ఓ లేఖను విడుదల చేయగా మరో లేఖను సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేశారు. ఢిల్లీ సీఎం పంజాబ్, గోవా ఎన్నికల కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు సుఖేష్ తన రెండో లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలను ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపించినట్లు తెలుస్తోంది. గోవా, పంజాబ్ ఎన్నికల కోసం ఆమ్ ఆదామీ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్ ఆ పార్టీకి డబ్బులు చెల్లించాలని అడిగారని కూడా ఆయన ఆరోపించారు.

కానీ తాను వాటిని పట్టించుకోకుండా నిశ్శబ్ధంగా ఉన్నానని.. కానీ జైలు పరపాలన అధికారుల ద్వారా నిరంతరం బెదిరింపులు కొనసాగాయని సుఖేష్ లేఖలో వెల్లడించారు. తాను అబద్ధాలు చెబుతున్నానని ఆప్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన సుకేష్ చంద్రశేఖర్, తాను అబద్ధాలు చెబుతున్నట్లయితే, జైలు యంత్రాంగం తనపై ఎందుకు ఒత్తిడి తెస్తోందని లేదా గతంలో చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు. కేజ్రీవాల్‌, మాజీ డీజీ సందీప్‌ గోయల్‌, జైలు పరిపాలనపై హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని సత్యేందర్‌ జైన్‌ నిరంతరం తనను ఎందుకు అడిగారని లేఖలో తెలిపారు. ఎన్నికల ప్రచారానికి ఎక్కువ నిధులు ఇవ్వమని అడగడమే కాకుండా తను నిరంతరం బెదిరించారన్నారు. ఆప్ నేతల తప్పు లేకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అని తన లేఖలో పేర్కొన్నాడు.

Also Read

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?

ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలకు ముందు బీజేపీ ఆదేశానుసారం పార్టీ, దాని నాయకుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆప్ నాయకుల ఆరోపణలను చంద్రశేఖర్ తోసిపుచ్చారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మరో లేఖ రాశారు. ఢిల్లీ ఎల్‌జీకి తన తాజా లేఖలో చంద్రశేఖర్ ఇలా రాశారు. ఆప్‌కు సంబంధించిన నిజాలు బయటికి రాకముందే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున, అత్యవసరంగా సీబీఐ దర్యాప్తును ఆదేశించాలని,ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి తనను అనుమతించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ ఎల్జీకి తాను చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌, తీహార్‌ జైలు మాజీ డీజీ (జైళ్లు) తనను బెదిరిస్తున్నారని సుఖేష్‌ ఆరోపించారు. తనకు జైన్‌, మాజీ డీజీ నుంచి తీవ్రమైన ముప్పు ఉందని లేఖలో చెప్పాడు.

Bhopal: బాబోయ్ వీళ్లు లేడీలా రౌడీలా.. నడిరోడ్డుపై ఏంటీ దారుణం

ఇదిలా ఉండగా.. గతంలో కూడా రెండు సార్లు సుఖేష్ లేఖలు రాశాడు. తన రెండో లేఖలో రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌ ఢిల్లీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్‌ బలవంతంగా తన నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారని ఆరోపించాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చిన ఆరోపణలు చేయడం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టించింది. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు సుకేశ్‌ లేఖ రాశాడు. తనను జైలులో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తనకు రక్షణ కల్పించేందుకు జైలులోనే ఉన్న సత్యేంద్ర జైన్‌కు రక్షణ కోసం డబ్బులు ఇచ్చానని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.50 కోట్లకు పైగా సుకేష్‌ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో రాజ్యసభ నామినేషన్ కోసం రూ.50 కోట్లు తీసుకుందని పేర్కొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అంటేనే ఒక మోసాల పార్టీ అంటూ ఆరోపించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు సుకేశ్‌ చంద్రశేఖర్‌ చేసిన ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తోసిపుచ్చారు. బీజేపీ కావాలనే ఇలాంటి కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు.

I request you to direct an urgent CBI investigation & allow me to file FIR as the pressure is getting too much& any undue event may take place before the truth about AAP is exposed: Conman Sukesh Chandrashekhar in a letter written to Delhi LG that has been confirmed by his lawyer pic.twitter.com/IaxikFrNk6

— ANI (@ANI) November 7, 2022

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aam admi party
  • letter
  • sukesh alleged aap
  • Sukesh Chandrashekar
  • sukesh chandrashekar letter

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions