Gujarat: గుజరాత్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్.. ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్లో ఎన్నికల తేదీలు ప్రకటించిన వేళ పలు పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్ ఇసుదాన్ గాధ్వి ఉంటారని ఆయన ప్రకటించారు. పంజాబ్ తరహాలోనే పోల్ నిర్వహించి సీఎం అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పటికే అధికార బీజేపీని గద్దె దించాలని ఆప్ దూకుడుగా ప్రచారం చేస్తోంది. మాజీ జర్నలిస్ట్, టీవీ యాంకర్ అయిన ఇసుదాన్ గాధ్వి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై ఆప్ సర్వేలో 73 శాతం ఓట్లు సాధించారు.
ఇదే విధమైన సర్వే తర్వాత పంజాబ్లో పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్ను ఎంపిక చేసింది. 40 ఏళ్ల ఇసుదాన్ గాధ్వి గతేడాది జూన్లో ఆప్లో చేరారు. అతను రాజకీయాల్లోకి రాకముందు గుజరాత్లో అత్యధిక రేటింగ్ పొందిన టీవీ వార్తలలో యాంకర్గా పనిచేశాడు. రాజకీయాల్లో తనలాంటి రైతు కుమారుడికి కేజ్రీవాల్ పెద్ద బాధ్యతను అప్పగించారని తన ఉద్వేగభరితమైన ప్రసంగంలో ఇసుదాన్ గాధ్వి అన్నారు. తాను చేయగలిగినంత సేవను చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని.. ఇప్పుడు తోటి గుజరాతీలకు కావాల్సినవన్నీ ఇవ్వాలనుకుంటున్నానన్నారు. తన చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానన్నారు.
Also Read
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Tensions on Korean Borders: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తత.. తృటిలో తప్పిన యుద్ధం
గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా రేసులో ఉన్నారు. గోపాల్ ఇటాలియా గత సంవత్సరం గాధ్వీని సంప్రదించి, రాజకీయాల్లోకి ఆహ్వానించగా ఆయన ఆప్లో చేరారు. ఆప్ అధినేతతో సమావేశం అనంతరం ఆయన నిర్ణయం ఖరారైంది. గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి. ఇసుదాన్ గాధ్వీ రైతు కుటుంబానికి చెందినవారు. గుజరాత్ జనాభాలో 48 శాతం ఉన్న ఓబీసీ తరగతికి చెందిన గాధ్వీకి ఈ స్థానం దక్కడం గమనార్హం.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!