Gujarat: గుజరాత్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్.. ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్లో ఎన్నికల తేదీలు ప్రకటించిన వేళ పలు పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్ ఇసుదాన్ గాధ్వి ఉంటారని ఆయన ప్రకటించారు. పంజాబ్ తరహాలోనే పోల్ నిర్వహించి సీఎం అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పటికే అధికార బీజేపీని గద్దె దించాలని ఆప్ దూకుడుగా ప్రచారం చేస్తోంది. మాజీ జర్నలిస్ట్, టీవీ యాంకర్ అయిన ఇసుదాన్ గాధ్వి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై ఆప్ సర్వేలో 73 శాతం ఓట్లు సాధించారు.
ఇదే విధమైన సర్వే తర్వాత పంజాబ్లో పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్ను ఎంపిక చేసింది. 40 ఏళ్ల ఇసుదాన్ గాధ్వి గతేడాది జూన్లో ఆప్లో చేరారు. అతను రాజకీయాల్లోకి రాకముందు గుజరాత్లో అత్యధిక రేటింగ్ పొందిన టీవీ వార్తలలో యాంకర్గా పనిచేశాడు. రాజకీయాల్లో తనలాంటి రైతు కుమారుడికి కేజ్రీవాల్ పెద్ద బాధ్యతను అప్పగించారని తన ఉద్వేగభరితమైన ప్రసంగంలో ఇసుదాన్ గాధ్వి అన్నారు. తాను చేయగలిగినంత సేవను చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని.. ఇప్పుడు తోటి గుజరాతీలకు కావాల్సినవన్నీ ఇవ్వాలనుకుంటున్నానన్నారు. తన చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానన్నారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
Tensions on Korean Borders: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తత.. తృటిలో తప్పిన యుద్ధం
గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా రేసులో ఉన్నారు. గోపాల్ ఇటాలియా గత సంవత్సరం గాధ్వీని సంప్రదించి, రాజకీయాల్లోకి ఆహ్వానించగా ఆయన ఆప్లో చేరారు. ఆప్ అధినేతతో సమావేశం అనంతరం ఆయన నిర్ణయం ఖరారైంది. గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి. ఇసుదాన్ గాధ్వీ రైతు కుటుంబానికి చెందినవారు. గుజరాత్ జనాభాలో 48 శాతం ఉన్న ఓబీసీ తరగతికి చెందిన గాధ్వీకి ఈ స్థానం దక్కడం గమనార్హం.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!