liquor case: ఈడీ ముందుకు కవిత.. ఢిల్లీకి క్యూ కట్టిన మంత్రులు.. ఏం జరగబోతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు వేగవంతం చేసింది. ఈ కేసు సంబంధించిన వ్యక్తులను విచారిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకోనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల కారణంగా బీఆర్ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు.
Also Read:MLC Eelctions: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్
Also Read
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఈ నెల 11న కవితను విచారించింది. దాదాపు 9 గంటలకు పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కావాలని అప్పుడే ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు. మరో వైపు ఈడీ సమన్లపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను ఈడీ విచారణ నుంచి తనను మినహాయించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈడీ అధికారులు తనను వేధిస్తున్నారని.. మహిళా హక్కులను కాలరాస్తున్నట్టుగా పిటిషన్లో పేర్కొన్నారు. అయితే కవిత పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ నేపథ్యంలో కవిత ఈ రోజు మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నారు.
Also Read: Viral Posters : హైదరాబాద్ లో వాల్ పోస్టర్ల కలకలం.. బీఎల్ సంతోష్ ఫొటో వైరల్..
ఇదిలా ఉంటే.. చెల్లికి తోడుగా ధైర్యంగా ఉండేందుకు మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. మొదటిసారి కూడా ఈడీ విచారణకు హాజరైన సమయంలో.. కవితకు అండగా ఉంటేందుకు కేటీఆర్తో పాటు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితల మంత్రులు హస్తినకు వెళ్లారు. ఇప్పుడు కూడా కేటీఆర్తో పాటు హరీశ్ రావు కూడా హస్తినకు వెళ్లారు. ఇవాళ్టి ఈడీ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత విచారణ సందర్భంగా ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. దీంతో ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!