WPL 2026 Final : విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. స్మృతి మంధాన ఊచకోత.!
- ఢిల్లీ భారీ స్కోర్ 203 పరుగులు
- మంధాన–వోల్ 165 పరుగుల భాగస్వామ్యం
- 41 బంతుల్లో 87తో మంధాన విధ్వంసం
- 19.4 ఓవర్లలో టైటిల్ కైవసం చేసుకున్న ఆర్సీబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వడోదర వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి, రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ను సగర్వంగా ముద్దాడింది. గురువారం జరిగిన ఈ ఉత్కంఠభరిత తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆర్సీబీ, గతేడాది సాధించిన విజయం యాదృచ్ఛికం కాదని నిరూపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లోనే 57 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు పటిష్టమైన పునాది వేయగా, ఆమెకు తోడుగా లారా వోల్వార్డ్ 44 పరుగులు, చినెల్ హెన్రీ మెరుపు వేగంతో 35 పరుగులు జోడించడంతో ఢిల్లీ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో అరుంధతి, సత్ఘరే , నడైన్ డిక్లార్క్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఒక్కో వికెట్ పడగొట్టారు.
Story Board : స్మార్ట్ ఫోన్ ఉంటే.. వ్యక్తిగత గోప్యత డొల్లేనా? WhatsAppకు సుప్రీం వార్నింగ్
Also Read
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
అయితే, 204 పరుగుల సునాయాసంగా లేని లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే గ్రేస్ హ్యారిస్ వికెట్ కోల్పోవడంతో కొంత ఆందోళన కలిగింది. కానీ, ఆ దశలో కెప్టెన్ స్మృతి మంధాన , జార్జియా వోల్ కలిసి విధ్వంసాన్ని సృష్టించారు. స్మృతి మంధాన కేవలం 41 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్ల ఆశలను నీరుగార్చగా, మరోవైపు జార్జియా వోల్ 53 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేసింది. వీరిద్దరూ రెండో వికెట్కు ఏకంగా 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశారు. మైదానంలోని ప్రతి మూలకు బౌండరీల వర్షం కురిపిస్తూ వడోదర స్టేడియాన్ని హోరెత్తించారు.
మ్యాచ్ ముగింపు దశలో వోల్, రిచా ఘోష్ , మంధాన వికెట్లు వరుసగా కోల్పోవడంతో ఢిల్లీ మళ్ళీ పోరాటంలోకి వచ్చినట్టు అనిపించినా, అదృష్టం మాత్రం ఆర్సీబీ పక్షానే నిలిచింది. ముఖ్యంగా 19వ ఓవర్లో మిన్ను మణి ఒక సులభమైన క్యాచ్ను చేజార్చడం ఢిల్లీ విజయవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది. ఆఖరి ఓవర్లో ఆర్సీబీకి విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా, ఒత్తిడిని అధిగమించిన రాధా యాదవ్ వరుసగా రెండు అద్భుతమైన ఫోర్లు బాది 19.4 ఓవర్లలోనే జట్టును విజేతగా నిలిపింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్కు చేరి రన్నరప్గా మిగిలిపోవాల్సి రావడం గమనార్హం. ఆర్సీబీ తన నిలకడైన ఆటతీరుతో మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుని తన అభిమానులకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది.
Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!