IND vs AUS 2nd ODI: ఘోర పరాజయం.. టీమిండియా పేరిట చెత్త రికార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worst Records Created By Team India After Big Loss Against Australia: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఎంత దారుణమైన ఓటమిని చవిచూసిందో అందరికీ తెలిసిందే! బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ ఘోరంగా విఫలమైంది. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి భారత జట్టు పేకమేడల్లా కుప్పకూలింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (31), ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (29 నాటౌట్) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వాళ్లందరూ తీవ్రంగా నిరాశపరిచారు. మొత్తం ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వగా.. అందులో నలుగురు డకౌట్ అయ్యారు. దీంతో.. భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51), మిచెల్ మార్ష్ (66) మెరుపు బ్యాటింగ్తో పరుగుల వర్షం కురిపించి.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని సాధించారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా తన పేరిట కొన్ని చెత్త రికార్డుల్ని నమోదు చేసుకుంది.
Bhanushree Mehra: బన్నీ ‘బ్లాక్’ వివాదం.. పెగ్గేస్తూ వివరణ ఇచ్చిన భానుశ్రీ
Also Read
- Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Ashes Test in India: భారత్లో యాషెస్ టెస్టు..? సానుకూలంగా స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.!
- Shreyas Iyer: 7 మ్యాచ్ల నిరీక్షణకు తెర.. రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్కు విముక్తి!
- SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
టీమిండియాకు వన్డేల్లో సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు.. 1986లో శ్రీలంకతో మ్యాచ్లో 78, 1993లో వెస్టిండీస్తో 100, 2017లో శ్రీలంకతో 112 అత్యల్ప స్కోర్లను భారత్ నమోదు చేసింది. ఇప్పుడు నాలుగోసారి 117 స్కోరుకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ని ఆస్ట్రేలియా జట్టు 39 ఓవర్లు (234 బంతులు) మిగిలి ఉండగానే ముగించింది. దీంతో.. బంతుల పరంగా భారత్కి ఇది అతిపెద్ద ఓటమిగా నిలిచింది. స్వదేశంలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇది రెండోసారి. 2020లోనూ ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ తొలిసారి 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఓవరాల్గా చూసుకుంటే.. ఆరోసారి ఈ మేరకు ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. 1981లో న్యూజిలాండ్, 1997లో వెస్టిండీస్, 2000, 2005లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిని మూటగట్టుకున్న భారత్.. 2020లో, ఇప్పుడు మళ్లీ ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడింది. ఇక స్వేదశంలో పేసర్లకే భారత్ 10 వికెట్లు కోల్పోవడం ఇది రెండోసారి. 2009లో గువాహటిలో జరిగిన మ్యాచ్లో ఆసీస్ పేస్ బౌలర్లు ఈ ఘనత సాధించారు.
Tollywood: వీళ్లలో ఒకడుంటేనే రచ్చ ఉంటది… ఇద్దరూ ఒక దగ్గరే ఉంటే అంతే ఇక…
తాజావార్తలు
-
Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
-
Honda ADV 160: మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. హోండా ADV 160తో సహా 10 టూవీలర్ల ఆవిష్కరణ..
-
KTR: ‘రాజ్యమా ఉలిక్కిపడు’.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!