Women IPL: మహిళల ఐపీఎల్ కు రంగం సిద్ధం.. వచ్చే ఏడాది ఉండే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s IPL likely to happen in next year: భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ ఓ సంచలనం. కొత్త టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మరింత ఆర్థికంగా బీసీసీఐ బలోపేతం అయ్యేందుకు ఐపీఎల్ సహకరించింది. ఇక విదేశీ క్రికెటర్లకు కూడా కాసులు వర్షం కురిపిస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ఇప్పటి వరకు 15 ఎడిషన్లను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఎప్పటినుంచో మహిళ ఐపీఎల్ జరపాలని బీసీసీఐ భావిస్తోంది. మహిళా క్రికెట్ కు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మహిళల ఐపీఎల్ నిర్వహిస్తే సక్సెస్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే మహిళల ఐపీఎల్ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షా సానుకూలంగా ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే..వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ చూసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ లో మార్పులు చేసింది. సాధారణంగా ప్రతీ ఏడాది భారత మహిళల సీజన్ నవంబర్ తో ప్రారంభం అయి ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది మాత్రం అక్టోబర్ తో ప్రారంభం అయి ఫిబ్రవరి వరకు సీజన్ ఉండబోతోంది. దీంతో పురుషుల ఐపీఎల్ ప్రారంభం అవడానికి ముందే.. 2023లో మహిళల ఐపీఎల్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆరు జట్లతో టోర్నీని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
Read Also: RSS: ప్రొఫైల్ పిక్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం
ప్రస్తుతం పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలే మహిళల జట్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటితో పాటు కొత్త ఫ్రాంచైసీలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై, చెన్నై ఫ్రాంచైసీలు మహిళా టీంలను దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ‘‘వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో మహిళల ఐపీఎల్ ఉంటుందని.. నాలుగు వారాల పాటు కొనసాగుతుంది.. సౌత్ ఆఫ్రికాలో ఫిబ్రవరి 26న మహిళల టీ 20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే టోర్నీ ప్రారంభం అవుతుంది.. ఐదు లేదా ఆరు జట్లతో టోర్నీ జరిగొచ్చని.. త్వరలోనే వేలం ప్రకటన రావచ్చు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!