Women IPL: మహిళల ఐపీఎల్ కు రంగం సిద్ధం.. వచ్చే ఏడాది ఉండే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s IPL likely to happen in next year: భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ ఓ సంచలనం. కొత్త టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మరింత ఆర్థికంగా బీసీసీఐ బలోపేతం అయ్యేందుకు ఐపీఎల్ సహకరించింది. ఇక విదేశీ క్రికెటర్లకు కూడా కాసులు వర్షం కురిపిస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ఇప్పటి వరకు 15 ఎడిషన్లను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఎప్పటినుంచో మహిళ ఐపీఎల్ జరపాలని బీసీసీఐ భావిస్తోంది. మహిళా క్రికెట్ కు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మహిళల ఐపీఎల్ నిర్వహిస్తే సక్సెస్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే మహిళల ఐపీఎల్ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షా సానుకూలంగా ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే..వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ చూసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ లో మార్పులు చేసింది. సాధారణంగా ప్రతీ ఏడాది భారత మహిళల సీజన్ నవంబర్ తో ప్రారంభం అయి ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది మాత్రం అక్టోబర్ తో ప్రారంభం అయి ఫిబ్రవరి వరకు సీజన్ ఉండబోతోంది. దీంతో పురుషుల ఐపీఎల్ ప్రారంభం అవడానికి ముందే.. 2023లో మహిళల ఐపీఎల్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆరు జట్లతో టోర్నీని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
- Hardik Pandya: "కెప్టెన్సీ ఇస్తేనే వస్తా".. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
- IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్కు భారీ షాక్?
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
Read Also: RSS: ప్రొఫైల్ పిక్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం
ప్రస్తుతం పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలే మహిళల జట్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటితో పాటు కొత్త ఫ్రాంచైసీలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై, చెన్నై ఫ్రాంచైసీలు మహిళా టీంలను దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ‘‘వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో మహిళల ఐపీఎల్ ఉంటుందని.. నాలుగు వారాల పాటు కొనసాగుతుంది.. సౌత్ ఆఫ్రికాలో ఫిబ్రవరి 26న మహిళల టీ 20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే టోర్నీ ప్రారంభం అవుతుంది.. ఐదు లేదా ఆరు జట్లతో టోర్నీ జరిగొచ్చని.. త్వరలోనే వేలం ప్రకటన రావచ్చు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
తాజావార్తలు
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!