Women IPL: మహిళల ఐపీఎల్ కు రంగం సిద్ధం.. వచ్చే ఏడాది ఉండే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s IPL likely to happen in next year: భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ ఓ సంచలనం. కొత్త టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మరింత ఆర్థికంగా బీసీసీఐ బలోపేతం అయ్యేందుకు ఐపీఎల్ సహకరించింది. ఇక విదేశీ క్రికెటర్లకు కూడా కాసులు వర్షం కురిపిస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ఇప్పటి వరకు 15 ఎడిషన్లను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఎప్పటినుంచో మహిళ ఐపీఎల్ జరపాలని బీసీసీఐ భావిస్తోంది. మహిళా క్రికెట్ కు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మహిళల ఐపీఎల్ నిర్వహిస్తే సక్సెస్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే మహిళల ఐపీఎల్ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షా సానుకూలంగా ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే..వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ చూసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ లో మార్పులు చేసింది. సాధారణంగా ప్రతీ ఏడాది భారత మహిళల సీజన్ నవంబర్ తో ప్రారంభం అయి ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది మాత్రం అక్టోబర్ తో ప్రారంభం అయి ఫిబ్రవరి వరకు సీజన్ ఉండబోతోంది. దీంతో పురుషుల ఐపీఎల్ ప్రారంభం అవడానికి ముందే.. 2023లో మహిళల ఐపీఎల్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆరు జట్లతో టోర్నీని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
Read Also: RSS: ప్రొఫైల్ పిక్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం
ప్రస్తుతం పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలే మహిళల జట్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటితో పాటు కొత్త ఫ్రాంచైసీలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై, చెన్నై ఫ్రాంచైసీలు మహిళా టీంలను దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ‘‘వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో మహిళల ఐపీఎల్ ఉంటుందని.. నాలుగు వారాల పాటు కొనసాగుతుంది.. సౌత్ ఆఫ్రికాలో ఫిబ్రవరి 26న మహిళల టీ 20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే టోర్నీ ప్రారంభం అవుతుంది.. ఐదు లేదా ఆరు జట్లతో టోర్నీ జరిగొచ్చని.. త్వరలోనే వేలం ప్రకటన రావచ్చు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
తాజావార్తలు
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!