Asia Cup 2022: 71వ శతకాన్ని భార్య అనుష్క, కూతురు వామికకు అంకితం చేసిన కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2022: అంతర్జాతీయ క్రికెట్లో తన 71వ సెంచరీని పూర్తి చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ శతకాన్ని తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, వారి కుమార్తె వామికకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసి.. గురువారం జరుగుతున్న ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన చివరి సూపర్ 4 పోరులో 20 ఓవర్లలో 212/2 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక భూమికను పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు టీమిండియాకు శుభారంభం అందించారు. మూడో ఓవర్ నుంచి పరుగుల వరదను ప్రారంభించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి కేఎల్ రాహుల్, విరాట్లు ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ హైలెట్గా నిలిచాడు. ఆరో ఓవర్లో స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్తో చెలరేగిపోయాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి విరాట్ (25*), రాహుల్ (26*) అజేయంగా ఉండటంతో భారత్ 52/0తో నిలిచింది.
Also Read
- Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్లోకి ఎంట్రీ..
- World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
- Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
- Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
పవర్ప్లే తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్పై విరాట్, కేఎల్ రాహుల్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. వీరిద్దరూ స్కోరుబోర్డును మంచి వేగంతో పరుగులు పెట్టించారు. రాహుల్ (42*), విరాట్ (44*)లతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 87/0తో నిలిచింది. విరాట్ సింగిల్తో ఫార్మాట్లో 33వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ 11.2 ఓవర్లలో ఒక ఫోర్తో జట్టును 100 పరుగుల మార్కును దాటడంలో సహాయం చేశాడు. తర్వాతి బంతికి మరో ఫోర్ సాధించి తన యాభైని సాధించాడు. ఆఫ్ఘన్ పేసర్ ఫరీద్ మాలిక్ 13వ ఓవర్లో వీరిద్దరి మధ్య 119 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించాడు. 41 బంతుల్లో 62 పరుగుల వద్ద రాహుల్ను లాంగ్ ఆన్లో నజీబుల్లా జద్రాన్ క్యాచ్ పట్టడంతో అవుట్ చేశాడు.
IND vs AFG: మూడేళ్ల తర్వాత సెంచరీ బాదిన కోహ్లీ.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు
సూర్యకుమార్ యాదవ్ తర్వాతి స్థానంలో వచ్చి మొదటి బంతికే సిక్సర్తో ప్రారంభించాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఫరీద్కి వికెట్ లభించింది. క్రీజులో రిషబ్ పంత్ ఉన్నాడు. అతను విరాట్తో కలిసి స్కోర్బోర్డ్ను పరుగులు పెట్టించడం కొనసాగించాడు. పంత్, విరాట్ ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లపై దాడిని కొనసాగించారు. విరాట్ దూకుడు, కనికరం లేకుండా బౌండరీలు బాదాడు. విరాట్ కోహ్లీ (122*), రిషబ్ పంత్ (20*)లతో భారత్ తన ఇన్నింగ్స్ను 212/2 వద్ద ముగించింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!