Asia Cup 2022: 71వ శతకాన్ని భార్య అనుష్క, కూతురు వామికకు అంకితం చేసిన కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2022: అంతర్జాతీయ క్రికెట్లో తన 71వ సెంచరీని పూర్తి చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ శతకాన్ని తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, వారి కుమార్తె వామికకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసి.. గురువారం జరుగుతున్న ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన చివరి సూపర్ 4 పోరులో 20 ఓవర్లలో 212/2 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక భూమికను పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు టీమిండియాకు శుభారంభం అందించారు. మూడో ఓవర్ నుంచి పరుగుల వరదను ప్రారంభించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి కేఎల్ రాహుల్, విరాట్లు ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ హైలెట్గా నిలిచాడు. ఆరో ఓవర్లో స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్తో చెలరేగిపోయాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి విరాట్ (25*), రాహుల్ (26*) అజేయంగా ఉండటంతో భారత్ 52/0తో నిలిచింది.
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
- 2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
పవర్ప్లే తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్పై విరాట్, కేఎల్ రాహుల్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. వీరిద్దరూ స్కోరుబోర్డును మంచి వేగంతో పరుగులు పెట్టించారు. రాహుల్ (42*), విరాట్ (44*)లతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 87/0తో నిలిచింది. విరాట్ సింగిల్తో ఫార్మాట్లో 33వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ 11.2 ఓవర్లలో ఒక ఫోర్తో జట్టును 100 పరుగుల మార్కును దాటడంలో సహాయం చేశాడు. తర్వాతి బంతికి మరో ఫోర్ సాధించి తన యాభైని సాధించాడు. ఆఫ్ఘన్ పేసర్ ఫరీద్ మాలిక్ 13వ ఓవర్లో వీరిద్దరి మధ్య 119 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించాడు. 41 బంతుల్లో 62 పరుగుల వద్ద రాహుల్ను లాంగ్ ఆన్లో నజీబుల్లా జద్రాన్ క్యాచ్ పట్టడంతో అవుట్ చేశాడు.
IND vs AFG: మూడేళ్ల తర్వాత సెంచరీ బాదిన కోహ్లీ.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు
సూర్యకుమార్ యాదవ్ తర్వాతి స్థానంలో వచ్చి మొదటి బంతికే సిక్సర్తో ప్రారంభించాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఫరీద్కి వికెట్ లభించింది. క్రీజులో రిషబ్ పంత్ ఉన్నాడు. అతను విరాట్తో కలిసి స్కోర్బోర్డ్ను పరుగులు పెట్టించడం కొనసాగించాడు. పంత్, విరాట్ ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లపై దాడిని కొనసాగించారు. విరాట్ దూకుడు, కనికరం లేకుండా బౌండరీలు బాదాడు. విరాట్ కోహ్లీ (122*), రిషబ్ పంత్ (20*)లతో భారత్ తన ఇన్నింగ్స్ను 212/2 వద్ద ముగించింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..