Asia Cup 2022: 71వ శతకాన్ని భార్య అనుష్క, కూతురు వామికకు అంకితం చేసిన కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2022: అంతర్జాతీయ క్రికెట్లో తన 71వ సెంచరీని పూర్తి చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ శతకాన్ని తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, వారి కుమార్తె వామికకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసి.. గురువారం జరుగుతున్న ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన చివరి సూపర్ 4 పోరులో 20 ఓవర్లలో 212/2 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక భూమికను పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు టీమిండియాకు శుభారంభం అందించారు. మూడో ఓవర్ నుంచి పరుగుల వరదను ప్రారంభించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి కేఎల్ రాహుల్, విరాట్లు ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ హైలెట్గా నిలిచాడు. ఆరో ఓవర్లో స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్తో చెలరేగిపోయాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి విరాట్ (25*), రాహుల్ (26*) అజేయంగా ఉండటంతో భారత్ 52/0తో నిలిచింది.
Also Read
పవర్ప్లే తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్పై విరాట్, కేఎల్ రాహుల్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. వీరిద్దరూ స్కోరుబోర్డును మంచి వేగంతో పరుగులు పెట్టించారు. రాహుల్ (42*), విరాట్ (44*)లతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 87/0తో నిలిచింది. విరాట్ సింగిల్తో ఫార్మాట్లో 33వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ 11.2 ఓవర్లలో ఒక ఫోర్తో జట్టును 100 పరుగుల మార్కును దాటడంలో సహాయం చేశాడు. తర్వాతి బంతికి మరో ఫోర్ సాధించి తన యాభైని సాధించాడు. ఆఫ్ఘన్ పేసర్ ఫరీద్ మాలిక్ 13వ ఓవర్లో వీరిద్దరి మధ్య 119 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించాడు. 41 బంతుల్లో 62 పరుగుల వద్ద రాహుల్ను లాంగ్ ఆన్లో నజీబుల్లా జద్రాన్ క్యాచ్ పట్టడంతో అవుట్ చేశాడు.
IND vs AFG: మూడేళ్ల తర్వాత సెంచరీ బాదిన కోహ్లీ.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు
సూర్యకుమార్ యాదవ్ తర్వాతి స్థానంలో వచ్చి మొదటి బంతికే సిక్సర్తో ప్రారంభించాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఫరీద్కి వికెట్ లభించింది. క్రీజులో రిషబ్ పంత్ ఉన్నాడు. అతను విరాట్తో కలిసి స్కోర్బోర్డ్ను పరుగులు పెట్టించడం కొనసాగించాడు. పంత్, విరాట్ ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లపై దాడిని కొనసాగించారు. విరాట్ దూకుడు, కనికరం లేకుండా బౌండరీలు బాదాడు. విరాట్ కోహ్లీ (122*), రిషబ్ పంత్ (20*)లతో భారత్ తన ఇన్నింగ్స్ను 212/2 వద్ద ముగించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!