Asia Cup 2022: 71వ శతకాన్ని భార్య అనుష్క, కూతురు వామికకు అంకితం చేసిన కోహ్లీ
Asia Cup 2022: అంతర్జాతీయ క్రికెట్లో తన 71వ సెంచరీని పూర్తి చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ శతకాన్ని తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, వారి కుమార్తె వామికకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసి.. గురువారం జరుగుతున్న ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన చివరి సూపర్ 4 పోరులో 20 ఓవర్లలో 212/2 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక భూమికను పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు టీమిండియాకు శుభారంభం అందించారు. మూడో ఓవర్ నుంచి పరుగుల వరదను ప్రారంభించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి కేఎల్ రాహుల్, విరాట్లు ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ హైలెట్గా నిలిచాడు. ఆరో ఓవర్లో స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్తో చెలరేగిపోయాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి విరాట్ (25*), రాహుల్ (26*) అజేయంగా ఉండటంతో భారత్ 52/0తో నిలిచింది.
Also Read
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
- Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
పవర్ప్లే తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్పై విరాట్, కేఎల్ రాహుల్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. వీరిద్దరూ స్కోరుబోర్డును మంచి వేగంతో పరుగులు పెట్టించారు. రాహుల్ (42*), విరాట్ (44*)లతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 87/0తో నిలిచింది. విరాట్ సింగిల్తో ఫార్మాట్లో 33వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ 11.2 ఓవర్లలో ఒక ఫోర్తో జట్టును 100 పరుగుల మార్కును దాటడంలో సహాయం చేశాడు. తర్వాతి బంతికి మరో ఫోర్ సాధించి తన యాభైని సాధించాడు. ఆఫ్ఘన్ పేసర్ ఫరీద్ మాలిక్ 13వ ఓవర్లో వీరిద్దరి మధ్య 119 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించాడు. 41 బంతుల్లో 62 పరుగుల వద్ద రాహుల్ను లాంగ్ ఆన్లో నజీబుల్లా జద్రాన్ క్యాచ్ పట్టడంతో అవుట్ చేశాడు.
IND vs AFG: మూడేళ్ల తర్వాత సెంచరీ బాదిన కోహ్లీ.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు
సూర్యకుమార్ యాదవ్ తర్వాతి స్థానంలో వచ్చి మొదటి బంతికే సిక్సర్తో ప్రారంభించాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఫరీద్కి వికెట్ లభించింది. క్రీజులో రిషబ్ పంత్ ఉన్నాడు. అతను విరాట్తో కలిసి స్కోర్బోర్డ్ను పరుగులు పెట్టించడం కొనసాగించాడు. పంత్, విరాట్ ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లపై దాడిని కొనసాగించారు. విరాట్ దూకుడు, కనికరం లేకుండా బౌండరీలు బాదాడు. విరాట్ కోహ్లీ (122*), రిషబ్ పంత్ (20*)లతో భారత్ తన ఇన్నింగ్స్ను 212/2 వద్ద ముగించింది.
తాజావార్తలు
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో