IND vs AFG: మూడేళ్ల తర్వాత సెంచరీ బాదిన కోహ్లీ.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు
IND vs AFG: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం.. దాదాపు వెయ్యి రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్లో గురువారం అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కోహ్లి.. 53 బంతుల్లో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్గా 61 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లీ తన టీ-20 కెరీర్లో అత్యధిక పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో నెట్టింట కోహ్లీ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు 119 పరుగులతో టాప్ స్కోరర్గా రోహిత్ ఉండగా… ఆఫ్ఘన్పై 122 పరుగుల చేసి విరాట్ రోహిత్ను వెనక్కి నెట్టాడు. ఈ ఇన్నింగ్స్లో తన ఆటతో కోహ్లీ హైలెట్గా నిలిచాడు. మైదానంలో అన్ని వైపులకు బంతిని పరుగులు తీయించిన కోహ్లీ ఓవరాల్ గా 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలో అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ, ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (71)తో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. అంతేకాదు, అంతర్జాతీయ టీ20 పోటీల్లో కోహ్లీకిదే తొలి సెంచరీ. దాంతోపాటే, భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్ మన్గానూ అవతరించాడు.
Also Read
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
- Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
Asia Cup 2022: ఆసియా కప్ జట్టులో అవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ చాహర్
విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ తర్వాత టీమ్ ఇండియా తమ బ్యాటింగ్ ప్రస్థానాన్ని 212/2 వద్ద ముగించింది. కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులు చేయగా, పంత్ 16 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు 20.0 ఓవర్లలో 213 పరుగులు చేయాలి. అంతకుముందు, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరిగిన ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నేటి మ్యాచ్లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి, కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.
తాజావార్తలు
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో