Virat Kohli : నార్వే డ్యాన్సర్లతో విరాట్ డ్యాన్స్.. కోహ్లీకి ఎమోజీ పంపిన అనుష్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడి వాతావరణం సందడిగా ఉంటుంది. మైదానంలో లేదా బయట ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా అతని ప్రవర్తన ఒకేలా ఉంటుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం దొరికిన విరామాన్ని కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు. ముంబైలో నార్వే డ్యాన్సర్లతో కలిసి కోహ్లీ చిందేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read : Off The Record: అక్కడ కమలంలో ఆధిపైత్యపోరు
Also Read
- Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్దే టైటిల్!
- IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్కు లక్కీ ఛాన్స్!
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్పై భారత్ 19-0తో సంచలన విజయం.!
క్విక్ స్టైల్ అనే నార్వే డ్యాన్స్ టీమ్ ముంబైలో ఒక ప్రొగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ లో కోహ్లీ సందడి చేశాడు. క్విక్ స్టైల్ బృందంలోని ఒక వ్యక్తి క్రికెట్ బ్యాట్ ను ఎత్తి ఏం చేయాలో ఆలోచిస్తుంటాడు. ఇంతలో వైట్ షర్ట్, నల్ల ప్యాంటు వేసుకున్న కోహ్లి సీన్ లోకి ఎంటరవుతాడు. ఈ క్రమంలో నార్వే బృందం ఇష్క్, స్టీరియో నేషన్స్ పాటలకు పాడుతుండగా కోహ్లీ బ్యాట్ పట్టుకుని మ్యూజిక్ కు తగినట్టుగా డ్యాన్స్ చేశాడు. కోహ్లినే అనుసరించిన నార్వే డ్యాన్సర్లు స్టెప్పులతో అలరించారు. ఈ వీడియోను కోహ్లి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. పోస్ట్ పెట్టిన గంటలోనే 5.4 లక్షల లైకులు, 2 మిలియన్ల మంది చూశారు. కోహ్లి స్టెప్పులను మెచ్చుకుంటూ అతని భార్య అనుస్క శర్మ ఎమోజీ పోస్టును షేర్ చేసింది.
Also Read : Groom Called Of Marriage: తక్కువ మార్కులొచ్చాయని పెళ్లి రద్దు.. తీరా చూస్తే ఊహించని ట్విస్ట్!
ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి సెంచరీతో మెరిశాడు. 186 పరుగులతో రాణించిన కోహ్లి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా తరపున కోహ్లి, శుభ్ మన్ గిల్ శతకాలు బాదడంతో భారీ స్కోర్ చేసింది. అయితే పిచ్ బ్యాంటింగ్ కు అనుకూలంగా ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొని వరుసగా నాలుగోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని అట్టిపెట్టుకుంది. మ్యాచ్ డ్రా చేసుకున్నప్పటికి కివీస్ చేతిలో శ్రీలంక పరాజయం పాలవ్వడంతో టీమిండియా డబ్య్లూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక ఇరుజట్ల మధ్య మూడు వన్డే సిరీస్ మార్చ్ 17 నుంచి ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
-
Russia Aircraft Deal: భారత్కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?