యుఎఇలో ఈరోజు ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత జట్టు ప్రధాన కోచ్ గా శాస్త్రి పదవీకాలం ముగియనుంది. దాంతో తర్వాత కోచ్ బాధ్యతలు ది వాల్ రాహుల్ ద్రావిడ్ తీసుకోనున్నట్లు నినట్టి నుండి ప్రచారం జరుగుతుంది. అయితే ఐపీఎల్ 2021 ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరియు సెక్రటరీ జే షాతో సమావేశమై… ఈ బాధ్యతలు స్వీకరించడానికి ద్రావిడ్ ను ఒప్పించారని వార్తలు వచ్చాయి. అయితే టీం ఇండియా తర్వాతి కోచ్ అనే వార్తల పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ను నియమించే విషయంలో ఏమి జరుగుతుందో నాకు సరిగ్గా తెలియదని అన్నారు. అయితే ద్రావిడ్ 2023 ప్రపంచ కప్ వరకే జట్టుకు కోచ్ గ వ్యవరించనున్నారు అని తెలుస్తుంది. అలాగే పట్టుబట్టి ఈ బాధ్యతలు ద్రావిడ్ చేతిలో పట్టిన గంగూలీ.. జీతంగా మిస్టర్ డిపెండబుల్ కు 10 కోట్లు ఇస్తున్నట్లు సమాచారం.