ప్రస్తుత భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆ పాత్రలో సేవలందించేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ భారత మాజీ క్రికెటర్ 2019లో సంజయ్ బంగర్ స్థానంలో బ్యాటింగ్ కోచ్ గా వచ్చాడు. అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ కు ముందు రాథోర్ మాట్లాడుతూ.. భారత జట్టులో అనుభవం చాలా ఉంది. అలా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లతో కలిసి పనిచేయడం చాలా గొప్ప విషయం. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసాను అని చెప్పారు. అయితే ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత జట్టుకు కోచ్ లుగా ఉన్న అందరి పదవి కాలం ముగుస్తుంది. అయితే హెడ్ కోచ్ రవిశాస్త్రి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ మళ్ళీ ఆ బాధ్యతల కోసం దరఖాస్తు చేయలేదు. కేవలం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మాత్రమే మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు.