Vaibhav Suryavanshi History: వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!
- 2026ని ఘనంగా ఆరంభించిన వైభవ్ సూర్యవంశీ
- 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన వైభవ్
- రిషబ్ పంత్ రికార్డు బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అండర్-19 జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 2026 ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా బెనోనీ లోని విల్లోమూర్ పార్క్లో జరిగిన రెండో యూత్ వన్డేలో మెరుపు ఇన్నింగ్స్తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి.. యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయుష్ మాథ్రే గైర్హాజరీలో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న వైభవ్.. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి 24 బంతుల్లో 68 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్లో ఒక ఫోర్, 10 భారీ సిక్సులు ఉండడం విశేషం.
ఈ మెరుపు ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2016 అండర్-19 వరల్డ్కప్లో నేపాల్పై ధాకాలో పంత్ 18 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఎనిమిదేళ్లుగా పంత్ పేరుపై ఉన్న ఆ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. బహుశా భారత యువ సంచలనం వైభవ్ నెలకొల్పిన ఈ రికార్డు బద్దలవడం కష్టమే అని చెప్పాలి. 14 ఏళ్ల వైభవ్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. గతేడాది ఇంగ్లండ్తో వోర్సెస్టర్లో జరిగిన మ్యాచ్లో కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేసి జూనియర్ స్థాయిలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
Also Read
- Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
- IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
- India vs England: రోహిత్, కోహ్లీ ఉన్నంత మాత్రాన గెలవలేం.. టీమిండియాను వేధిస్తున్న ఈ 4 కీలక ప్రశ్నలు!
- CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
Also Read: BCCI vs BCB: భారత్కు బంగ్లాదేశ్ జట్టును పంపం.. మేం ఐసీసీతోనే తేల్చుకుంటాం!
ఐపీఎల్లోనూ వైభవ్ తన సత్తా చాటాడు. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతడు.. గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ భారత ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన శతకంగా అది రికార్డులకెక్కింది. దక్షిణాఫ్రికా సిరీస్కు ముందు వైభవ్, విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుత ప్రదర్శనల ఫలితంగా భారత ‘ఏ’ జట్టుకు తొలిసారి పిలుపు అందుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే దేశవాళీ, అంతర్జాతీయ స్థాయిల్లో వరుసగా రికార్డులు సృష్టిస్తున్న ఈ యువ సంచలనం భారత క్రికెట్ భవిష్యత్తుగా అభిమానులు అభివర్ణిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!