Champions Trophy Final: న్యూజిలాండ్తో ఫైనల్ ఫైట్.. కివీస్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రోహిత్..?
- కాసేపట్లో భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఫైట్..
- భారత్ జట్టులో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు టాక్..
- కివీస్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy Final: దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు భారత్ రెడీ అయింది. మరి తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే, మరోసారి నలుగురు స్పిన్నర్లతో ఆడిస్తే మంచిదని క్రికెట్ పండితులు అంటున్నారు. 25 ఏళ్ల తర్వాత కివీస్తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడుతుండటంతో తుది జట్టు ఎంపిక అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో రోహిత్ సేన ఒకే మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Read Also: Bollywood : యాడ్ ద్వారా చిక్కులో పడిన స్టార్ హీరోలు
Also Read
- FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
- Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
- FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
- AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
అయితే, ఫైనల్కు ముందు విరాట్ కోహ్లీ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.. కానీ, అతడు తుది పోరులో ఆడటం ఖాయమని బీసీసీఐ వెల్లడించింది. దీంతో శుభ్మన్ గిల్తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత విరాట్ వన్డౌన్లో రానుండగా.. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య తర్వాత బ్యాటింగ్కు రానున్నారు. దీంతో మరోసారి రిషభ్ పంత్ బెంచ్కే పరిమితం కానున్నాడు. కాగా, ఈ మ్యాచ్కు అత్యంత కీలకం స్పిన్ డిపార్ట్మెంట్.. గత మ్యాచుల్లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత జట్టు.. మరోసారి అదే కాంబినేషన్తో ఫైనల్ లో ఆడబోతుంది. ఇక, ఒక్క మార్పు చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ను మరింత బలోపేతం చేయడంతో పాటు కుడి చేతి వాటం స్పిన్నర్ను తుది జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తారని సమాచారం.
Read Also: Chelluboyina Venu: ప్రజాజీవనాన్ని మార్చడానికి ప్రయత్నించింది వైసీపీ
కాగా, గత రెండు మ్యాచుల్లో కుల్దీప్ 17.3 ఓవర్లు వేసి 100 రన్స్ ఇచ్చి కేవలం 2 వికెట్లే తీసుకున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టి.. సుందర్ను తీసుకుంటే 9వ నంబర్ వరకు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. పిచ్ బౌలింగ్కు సహకరిస్తున్నందున బ్యాటింగ్ కూడా చాలా కీలకమే కానుంది. ఇప్పటికే, జడేజా, అక్షర్, వరుణ్ చక్రవర్తితో కూడిన స్పిన్ విభాగం స్ట్రాంగ్ గా ఉంది. వారికి తోడుగా సుందర్ను తీసుకొస్తారని తెలుస్తుంది. కానీ, తుది జట్టుపై ఇప్పటి వరకు టీమ్ నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం రాలేదు.
తాజావార్తలు
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!