Team India Won: ఉత్కంఠ పోరులో టీమిండియా విక్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరేబియన్ పర్యటనను విజయంతో ప్రారంభించింది… టీమిండియా. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డేలో… 3 పరుగుల తేడాతో విండీస్పై గెలిచింది. ఆఖరి బంతి దాకా సాగిన మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ భారత యువజట్టు.. విజేతగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు… ఓపెనర్లు శిఖర్ ధవన్, శుభ్మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు 119 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో… గిల్ రనౌట్ కావడంతో… సెంచరీ పార్ట్నర్షిప్కు తెరపడింది. 53 బంతుల్లోనే 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 64 పరుగులు చేశాడు… గిల్. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి ధాటిగా ఆడాడు… ధవన్. ఇద్దరూ రెండో వికెట్కు 94 పరుగులు జోడించారు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న ధవన్… 97 పరుగుల దగ్గర ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ రాణించలేకపోయినా… చివర్లో దీపక్ హుడా, అక్సర్ పటేల్ ధాటిగా ఆడటంతో… 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోరు చేసింది… టీమిండియా.
Read Also: BS Yediyurappa Retirement: రాజకీయాలకు గుడ్బై.. ఇక నా వళ్లకాదు అంటున్న సీనియర్ పొలిటీషియన్
Also Read
- India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
ఇక, 309 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్… ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఐదో ఓవర్లోనే ఓపెనర్ హోప్ వికెట్ కోల్పోయినా… మరో ఓపెనర్ కైల్, వన్డౌన్లో వచ్చిన బ్రూక్స్… టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. రెండో వికెట్కు ఇద్దరూ వంద పరుగులకు పైగా జోడించారు. కైల్ 75 రన్స్ చేస్తే, బ్రూక్స్ 46 పరుగులు తీశాడు. ఐదు పరుగుల వ్యవధిలో ఇద్దరూ ఔటైనా… ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఏ మాత్రం ఒత్తడికి లోనుకాకుండా ఆడారు. బ్రాండన్ కింగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఔటైతే… పూరన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో 25 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. 196 పరుగులకు 5 వికెట్లు పడిపోవడంతో… విండీస్ బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడారు. దాంతో రన్రేట్ పెరిగిపోయింది. చివర్లో షెపర్డ్, హోసన్ ధాటిగా ఆడి… ధవన్ సేనను కంగారు పెట్టారు. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా… సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 11 రన్సే ఇచ్చాడు. దాంతో… చివరి బంతికి 3 పరుగుల తేడాతో నెగ్గింది ధవన్ సేన. భారత బౌలర్లలో సిరాజ్, కృష్ణ, చాహల్ తలో రెండు వికెట్లు తీశారు. 97 పరుగులు చేసిన కెప్టెన్ ధవన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇక రెండో వన్డే రేపు జరగనుంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!