Team India Won: ఉత్కంఠ పోరులో టీమిండియా విక్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరేబియన్ పర్యటనను విజయంతో ప్రారంభించింది… టీమిండియా. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డేలో… 3 పరుగుల తేడాతో విండీస్పై గెలిచింది. ఆఖరి బంతి దాకా సాగిన మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ భారత యువజట్టు.. విజేతగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు… ఓపెనర్లు శిఖర్ ధవన్, శుభ్మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు 119 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో… గిల్ రనౌట్ కావడంతో… సెంచరీ పార్ట్నర్షిప్కు తెరపడింది. 53 బంతుల్లోనే 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 64 పరుగులు చేశాడు… గిల్. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి ధాటిగా ఆడాడు… ధవన్. ఇద్దరూ రెండో వికెట్కు 94 పరుగులు జోడించారు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న ధవన్… 97 పరుగుల దగ్గర ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ రాణించలేకపోయినా… చివర్లో దీపక్ హుడా, అక్సర్ పటేల్ ధాటిగా ఆడటంతో… 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోరు చేసింది… టీమిండియా.
Read Also: BS Yediyurappa Retirement: రాజకీయాలకు గుడ్బై.. ఇక నా వళ్లకాదు అంటున్న సీనియర్ పొలిటీషియన్
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
ఇక, 309 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్… ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఐదో ఓవర్లోనే ఓపెనర్ హోప్ వికెట్ కోల్పోయినా… మరో ఓపెనర్ కైల్, వన్డౌన్లో వచ్చిన బ్రూక్స్… టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. రెండో వికెట్కు ఇద్దరూ వంద పరుగులకు పైగా జోడించారు. కైల్ 75 రన్స్ చేస్తే, బ్రూక్స్ 46 పరుగులు తీశాడు. ఐదు పరుగుల వ్యవధిలో ఇద్దరూ ఔటైనా… ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఏ మాత్రం ఒత్తడికి లోనుకాకుండా ఆడారు. బ్రాండన్ కింగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఔటైతే… పూరన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో 25 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. 196 పరుగులకు 5 వికెట్లు పడిపోవడంతో… విండీస్ బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడారు. దాంతో రన్రేట్ పెరిగిపోయింది. చివర్లో షెపర్డ్, హోసన్ ధాటిగా ఆడి… ధవన్ సేనను కంగారు పెట్టారు. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా… సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 11 రన్సే ఇచ్చాడు. దాంతో… చివరి బంతికి 3 పరుగుల తేడాతో నెగ్గింది ధవన్ సేన. భారత బౌలర్లలో సిరాజ్, కృష్ణ, చాహల్ తలో రెండు వికెట్లు తీశారు. 97 పరుగులు చేసిన కెప్టెన్ ధవన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇక రెండో వన్డే రేపు జరగనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!