IND vs PAK T20 World Cup: భారత్ వర్సెస్ పాక్: 2026 టీ20 వరల్డ్ కప్లో ఎన్నిసార్లు తలపడనున్నారు..?
- 2026లో భారత్-పాకిస్థాన్ మధ్య హోరాహోరీ పోటీలు..
- ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు పండగే పండుగ..
- భారత్- పాక్ మ్యాచ్లు.. అభిమానుల హార్ట్బీట్ పెరుగుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK T20 World Cup: 2026 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒక పండుగలా మారబోతుంది. అండర్-19 వరల్డ్ కప్ నుంచి మెన్స్ టీ20 వరల్డ్ కప్, మహిళల టీ20 వరల్డ్ కప్ వరకూ అన్ని వర్గాలు, అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి పోటీలు జరగబోతున్నాయి. ఈ టోర్నీల్లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే మ్యాచ్ ఎదైనా ఉందంటే అది కేవలం భారత్-పాకిస్థాన్ మధ్య పోరే. గత ఏడాది 2025లో కూడా ఇరు జట్లు పలు టోర్నీల్లో పరస్పరం తలపడ్డాయి. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్లో మూడు సార్లు, మహిళల వన్డే వరల్డ్ కప్, అండర్-19 ఆసియా కప్లోనూ భారత్-పాక్ తలపడటం అభిమానులను ఉర్రూతలూగించాయి. 2026లో కూడా ఈ రెండు బద్ద శత్రువుల మధ్య పోరు కొనసాగనుంది.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
- Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
- Horror Spell: టీమిండియా స్టార్ పేసర్ను పొట్టుపొట్టు కొట్టిన లోకల్ ప్లేయర్స్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే!
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
మెన్స్ టీ20 వరల్డ్ కప్లో భారత్–పాక్ సమరం
2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్లో భారత్, పాకిస్థాన్ జట్లు తొలిసారి ఫిబ్రవరి 15వ తేదీన తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఇది గ్రూప్ దశలో జరిగే మ్యాచ్ కాగా, భారత్ ఈ టోర్నీలో ఆడే ఏకైక విదేశీ మ్యాచ్ ఇదే కావడం విశేషం. గ్రూప్ దశలోనే కాకుండా ఇరు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్కు అర్హత సాధిస్తే మరోసారి ముఖాముఖి పోటీపడే ఛాన్స్ కూడా ఉంది. దీంతో టీ20 వరల్డ్ కప్లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్లపై అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగాయి.
Read Also: TheRajaSaab : రాజాసాబ్ రన్ టైమ్ ఏకంగా నాలుగు గంటలపైనే : మారుతీ
అండర్-19 మెన్స్ వరల్డ్ కప్లో పోరాడే అవకాశం..
అండర్-19 మెన్స్ వరల్డ్ కప్లో భారత్, పాకిస్థాన్ నేరుగా లీగ్ దశలో తలపడే అవకాశం లేదు. డ్రా ప్రకారం గ్రూప్-Aలో భారత్, గ్రూప్-Bలో పాకిస్థాన్ ఉన్నాయి. అందువల్ల లీగ్ దశలోనూ, సూపర్ సిక్సెస్లోనూ ఇరు జట్లు ముఖాముఖి పోటీ పడే ఛాన్స్ లేదు. కానీ, సెమీఫైనల్ లేదా ఫైనల్కు రెండు జట్లు చేరితే మాత్రమే భారత్-పాక్ మధ్య పోరు చూసే అవకాశం ఉంది.
Read Also: Hyderabad Fog: కాశ్మీర్ను తలపించేలా హైదరాబాద్.. శివారు ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు..
మహిళల టీ20 వరల్డ్ కప్లో హోరాహోరీ
2025లో జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్లో ట్రోఫీని గెలిచిన భారత మహిళల జట్టు.. 2026లో ఇంగ్లండ్ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్ కప్లో తమ తొలి టైటిల్ను గెలుచుకోవాలని ఆశిస్తోంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో ఉండడం విశేషం. జూన్ 14వ తేదీన ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ జరగనుంది. అలాగే, రెండు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్కు చేరితే మరోసారి కీలక పోరులో తలపడే ఛాన్స్ ఉంది. కాబట్టి, మొత్తంగా 2026లో మెన్స్, మహిళల, జూనియర్ క్రికెట్ స్థాయిల్లో భారత్-పాక్ మ్యాచ్లు క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని సృష్టించనున్నాయి. ప్రతి మ్యాచ్పై ఉత్కంఠతను తారాస్థాయికి పెంచేలా కనిపిస్తోంది. క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠభరితమైన ఈ బద్ద శత్రువులు 2026లో జరిగే అన్ని టోర్నీలను కలిపి సుమారు 8 సార్లు పోటీ పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!