IND vs ENG Test: తడబడిన భారత్.. ఆదుకున్న కరుణ్ నాయర్..
- ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో తడబడిన టీమిండియా..
- వర్షం ప్రభావంతో బ్యాటింగ్ లో విఫలమైన భారత బ్యాటర్లు..
- రెండో రోజు పటిష్టమైన బ్యాటింగ్ చేస్తేనే మ్యాచ్ లో నిలవనున్న భారత్..
IND vs ENG Test: లండన్లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది టీమిండియా. అయితే, వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అర్థ శతకం చేసిన ఆదుకున్నాడు. కరుణ్ 98 బంతుల్లో 52 రన్స్ తో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. ఇక, అతడితో పాటు వాషింగ్టన్ సుందర్ (19) ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. కాగా, టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్(2), కేఎల్ రాహుల్ (14), రవీంద్ర జడేజా(9), కెప్టెన్ గిల్ (21) తీవ్రంగా నిరాశపరచగా.. సాయి సుదర్శన్ (38) పర్వాలేదనిపించాడు. అయితే, ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, అట్కిన్సన్ తలా రెండు వికెట్లు తీసుకొగా.. క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
Read Also: Yuzvendra Chahal: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. విడాకులపై మౌనం వీడిన చాహల్
Also Read
- World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
- IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్మెన్ దూరం..
- Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
అయితే, టీమిండియా బ్యాటింగ్ లో విఫలం కావడానికి ప్రధాన కారణం మాత్రం ఓవల్ లో కురిసిన వర్షమే అని చెప్పాలి. ఎందుకంటే.. వరుస విరామాల్లో వాన పడటంతో స్టేడియం పచ్చిగా ఉండటం వల్ల ఇంగ్లాండ్ బౌలర్లకు అనుకూలంగా మారింది. దీంతో వరుస సెషన్స్ లో టీమిండియాపై ఒత్తిడి పెంచి వికెట్లు సాధించగలిగారు. మరోవైపు, శుభ్మన్ గిల్ వరుసగా అయిదో టెస్టులోనూ టాస్ ఓడిపోవడం జట్టు వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపింది. రెండో రోజు ఆటలో బ్యాటింగ్ పటిష్టంగా కొనసాగితేనే భారత్ తిరిగి మ్యాచ్ లో నిలుస్తుంది.. లేకపోతే.. ఈ సిరీస్ ను టీమిండియా కోల్పోయే అవకాశం ఉంది.
Read Also: US Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఆ ఒక్క రంగంలోనే లక్ష ఉద్యోగాలకు ఎసరు..!
మరోవైపు, భారత్ ఇన్నింగ్స్లో అనూహ్య సంఘటన జరిగింది. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన వ్యవహారశైలి చర్చకు వచ్చింది. 13వ ఓవర్ వేసిన టంగ్ భారత బ్యాటర్ సాయి సుదర్శన్కు యార్కర్ బాల్ సంధించాడు. దానిని ఆడలేక సాయి కింద పడిపోగా.. బంతి ప్యాడ్స్కు తగలడంతో టంగ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. దీనిని ధర్మసేన తిరస్కరించడం వరకు బాగానే ఉంది.. కానీ, అవుట్ కాదని చెబుతూనే అతను బంతి ముందే బ్యాట్కు తగిలినట్లుగా తన వేళ్లతో ఇంగ్లీష్ జట్టుకు సైగ చేశాడు. అయితే, రూల్స్ ప్రకారం డీఆర్ఎస్ కోసం ఇచ్చే 15 సెకన్లు ముగిసే వరకు ఆటగాళ్లకు సహకరించే సంజ్ఞలు అంపైర్లు చేయరాదు.. కానీ ధర్మసేన ఇలా చేయడం వల్ల ఇంగ్లాండ్ జట్టుకు పరోక్షంగా సహకరించినట్లైంది. దీంతో అంపైర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Condom Prices: బెడ్రూమ్లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?