US Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఆ ఒక్క రంగంలోనే లక్ష ఉద్యోగాలకు ఎసరు..!
- ఈరోజు నుంచి భారత ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారీఫ్స్..
- రత్నాభరణాల రంగంలోనే లక్ష మంది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం..
- చేతితో తయారు చేసే ఆభరణాల ధరలు మరింత పెరిగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి వచ్చే భారతదేశ ఉత్పత్తులపై విధించిన అదనపు 25 శాతం టారీఫ్స్ ఈరోజు (ఆగస్టు 1న) నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావంతో ఒక్క రత్నాభరణాల రంగంలోనే దాదాపు లక్ష మంది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడబోతుందన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. చేతితో తయారు చేసే ఆభరణాల ధరలు మరింత పెరిగి, అక్కడ అమ్ముడుపోక పోవచ్చని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి (AIGJDC) ఛైర్మన్ రాజేశ్ రోక్డే పేర్కొన్నారు. గతంలో అమెరికా 10 శాతం సుంకం విధించినపుడు సుమారు 50 వేల మంది ఉపాధి కోల్పోగా.. కొత్త టారిఫ్ అమలుతో లక్ష మందికి పైగా జీవితం రోడ్డునపడొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరమ’ని రోక్డే చెప్పుకొచ్చారు. ఐరోపా సమాఖ్య, పశ్చిమాసియా లాంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు ఈ రంగం చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
Read Also: Kolkata: బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్ అరెస్ట్.. పోలీస్ కస్టడీకి అప్పగింత
Also Read
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
రాగి ఉత్పత్తులపై 50శాతం టారీఫ్స్..
అమెరికా పాక్షిక రాగి, రాగి ఆధారిత ఉత్పత్తులపై 50 శాతం టారీఫ్స్ విధించింది. 2024-25లో యూఎస్ కు మనదేశం 360 మిలియన్ డాలర్ల విలువైన రాగి ఉత్పత్తులను ఎగుమతి చేయగా.. ఇకపై వీటి ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా నుంచి వచ్చే రాగి ఉత్పత్తులపై మనదేశం 2.5-10 శాతం సుంకమే విధించే అవకాశం ఉంది.
దుస్తుల ఎగుమతి తగ్గే ఛాన్స్..
తాజా సుంకాలతో దుస్తుల ఎగుమతులు తగ్గనుంది.. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వరకూ ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. భారత్ కు చెందిన రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో అమెరికాకు చేరుతున్నవే 33 శాతం కావడం గమనార్హం. యూఎస్ దిగుమతి చేసుకునే దుస్తుల్లో భారత్ వాటా 2020లో 4.5% ఉండగా.. 2024లో 5.8 శాతానికి చేరుకుంది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లకు కలిపి 49 శాతం వాటా ఉంది.
బియ్యం ఎగుమతులకు ఆటంకాలే..
భారతదేశానికి చెందిన బియ్యం ఎగుమతులకు ప్రస్తుత సుంకాలు తాత్కాలిక అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. కానీ, వియత్నాం, పాకిస్థాన్ లాంటి పోటీ దేశాలతో పోలిస్తే బియ్యం ధర- నాణ్యత పరంగా భారత్దే పైచేయి అని బియ్యం ఎగుమతిదార్ల సమాఖ్య పేర్కొంది. భారత్కు అతిపెద్ద బాస్మతీ మార్కెట్ అమెరికా మాత్రం కాదు. 2023-24లో మనదేశం నుంచి 52.4 లక్షల టన్నుల బాస్మతీ బియ్యం ఎగుమతి అయింది.. అందులో అమెరికాకు 2.34 లక్షల టన్నులే.. భారత బియ్యంపై సుంకం(25%+) పోటీదార్లయిన చైనా (34%), వియత్నాం(46%), పాకిస్థాన్(29%), థాయ్లాండ్(36%) కంటే తక్కువే.
తాజావార్తలు
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!