US Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఆ ఒక్క రంగంలోనే లక్ష ఉద్యోగాలకు ఎసరు..!
- ఈరోజు నుంచి భారత ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారీఫ్స్..
- రత్నాభరణాల రంగంలోనే లక్ష మంది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం..
- చేతితో తయారు చేసే ఆభరణాల ధరలు మరింత పెరిగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి వచ్చే భారతదేశ ఉత్పత్తులపై విధించిన అదనపు 25 శాతం టారీఫ్స్ ఈరోజు (ఆగస్టు 1న) నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావంతో ఒక్క రత్నాభరణాల రంగంలోనే దాదాపు లక్ష మంది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడబోతుందన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. చేతితో తయారు చేసే ఆభరణాల ధరలు మరింత పెరిగి, అక్కడ అమ్ముడుపోక పోవచ్చని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి (AIGJDC) ఛైర్మన్ రాజేశ్ రోక్డే పేర్కొన్నారు. గతంలో అమెరికా 10 శాతం సుంకం విధించినపుడు సుమారు 50 వేల మంది ఉపాధి కోల్పోగా.. కొత్త టారిఫ్ అమలుతో లక్ష మందికి పైగా జీవితం రోడ్డునపడొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరమ’ని రోక్డే చెప్పుకొచ్చారు. ఐరోపా సమాఖ్య, పశ్చిమాసియా లాంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు ఈ రంగం చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
Read Also: Kolkata: బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్ అరెస్ట్.. పోలీస్ కస్టడీకి అప్పగింత
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
రాగి ఉత్పత్తులపై 50శాతం టారీఫ్స్..
అమెరికా పాక్షిక రాగి, రాగి ఆధారిత ఉత్పత్తులపై 50 శాతం టారీఫ్స్ విధించింది. 2024-25లో యూఎస్ కు మనదేశం 360 మిలియన్ డాలర్ల విలువైన రాగి ఉత్పత్తులను ఎగుమతి చేయగా.. ఇకపై వీటి ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా నుంచి వచ్చే రాగి ఉత్పత్తులపై మనదేశం 2.5-10 శాతం సుంకమే విధించే అవకాశం ఉంది.
దుస్తుల ఎగుమతి తగ్గే ఛాన్స్..
తాజా సుంకాలతో దుస్తుల ఎగుమతులు తగ్గనుంది.. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వరకూ ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. భారత్ కు చెందిన రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో అమెరికాకు చేరుతున్నవే 33 శాతం కావడం గమనార్హం. యూఎస్ దిగుమతి చేసుకునే దుస్తుల్లో భారత్ వాటా 2020లో 4.5% ఉండగా.. 2024లో 5.8 శాతానికి చేరుకుంది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లకు కలిపి 49 శాతం వాటా ఉంది.
బియ్యం ఎగుమతులకు ఆటంకాలే..
భారతదేశానికి చెందిన బియ్యం ఎగుమతులకు ప్రస్తుత సుంకాలు తాత్కాలిక అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. కానీ, వియత్నాం, పాకిస్థాన్ లాంటి పోటీ దేశాలతో పోలిస్తే బియ్యం ధర- నాణ్యత పరంగా భారత్దే పైచేయి అని బియ్యం ఎగుమతిదార్ల సమాఖ్య పేర్కొంది. భారత్కు అతిపెద్ద బాస్మతీ మార్కెట్ అమెరికా మాత్రం కాదు. 2023-24లో మనదేశం నుంచి 52.4 లక్షల టన్నుల బాస్మతీ బియ్యం ఎగుమతి అయింది.. అందులో అమెరికాకు 2.34 లక్షల టన్నులే.. భారత బియ్యంపై సుంకం(25%+) పోటీదార్లయిన చైనా (34%), వియత్నాం(46%), పాకిస్థాన్(29%), థాయ్లాండ్(36%) కంటే తక్కువే.
తాజావార్తలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!