అజేయ రికార్డు హుష్కాకి… ఓటమితో కొత్త ఏడాదికి స్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధిస్తుందన్న అభిమానుల ఆశలను టీమిండియా తలకిందులు చేసింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు… రెండు ఇన్నింగ్స్ల్లోనూ 300 పరుగులు చేయకపోవడం నిరాశ కలిగించే విషయమే. దీంతో తొలిసారిగా వాండరర్స్ స్టేడియంలో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఈ టెస్టు ముందు వరకు వాండరర్స్ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. రెండు మ్యాచ్లను గెలిచి.. మరో మూడు మ్యాచ్లను డ్రా చేసుకుంది. అయితే తొలిసారిగా ఈ పర్యటనలో జోహన్నెస్ బర్గ్లో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. దీంతో ఈ మైదానంలో టీమిండియా అజేయ రికార్డుకు బ్రేక్ పడింది.
Read Also: తండ్రి అయిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డికాక్
Also Read
- Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
మరోవైపు కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించిన భారత్ ముందు ఈ ఏడాది చాలా సవాళ్లు ఉన్నాయి. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంకలతో సిరీస్లతో పాటు ఇంగ్లండ్ పర్యటన, టీ20 ప్రపంచకప్, ఆసియా కప్… ఇలా చాలా మ్యాచ్లు భారత్ ఆడాల్సి ఉంది. ఆయా మ్యాచ్లలో ఫలితాలు అనుకూలంగా రావాలంటే పటిష్ట జట్టును ఏర్పాటు చేసుకోవాలి. పరిమిత ఓవర్లకు రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించడంతో అతడు ఏ మేరకు రాణిస్తాడో కాలమే సమాధానం చెప్పాలి. అయితే భారత బౌలర్లు తరచూ గాయాలపాలవుతున్నారు. దీంతో జట్టును పదేపదే మార్చాల్సి రావడంతో ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. బౌలింగ్ విషయంలో బుమ్రా, షమీ, ఇషాంత్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు ఫిట్నెస్ను కాపాడుకుంటూ మెరుగైన ప్రదర్శన చేస్తేనే భారత్కు విజయాలు దక్కుతాయి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!