T20 World Cup: అదరగొట్టిన బౌలర్లు.. తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియాదే విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా ఆస్ట్రేలియాకు చేరుకుని అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లను ఆడుతూ తన అస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి భారత్ ముందు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ (3), పంత్ (9) దారుణంగా విఫలమయ్యారు. అయితే ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మరోసారి రాణించాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అతడు 52 పరుగులు చేసి అవుటయ్యాడు. దీపక్ హుడా (22), హార్దిక్ పాండ్యా (27) రాణించారు. వెస్ట్రర్న్ ఆస్ట్రేలియా బౌలర్లలో బెహండార్ఫ్, కెల్లీ చెరో రెండు వికెట్లు సాధించారు. జె.రిచర్డ్ సన్, ఆండ్రూ టై తలో వికెట్ తీశారు.
Read Also: Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మరో కేసు
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అనంతరం 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్రర్న్ ఆస్ట్రేలియా 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 13 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఫానింగ్ (59) మాత్రమే రాణించాడు. టీమిండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు ఓవర్లు వేసి ఒక మెయిడిన్ సహా ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్, చాహల్ తలో రెండు వికెట్లు తీశారు. హర్షల్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. మొత్తానికి ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు రాణించడం అభిమానులకు ఊరట కలిగించింది. మరి ప్రధాన టోర్నీలోనూ భారత బౌలర్లు ఇలాగే రాణించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!