MS Dhoni: ఇట్లాంటి టీమిండియాను నేను ఇప్పటివరకు చూడలేదు.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త
- ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం..
- టీమిండియాను ప్రశంసించిన ఎంఎస్ ధోనీ..
- భారత్ ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి: ఎంఎస్ ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026 కోసం అన్ని జట్లు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 4-1తో ఘన విజయం సాధించిన భారత జట్టు తన సత్తాను మరోసారి నిరూపించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో టీమిండియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక, భారత జట్టులో విధ్వంసకర బ్యాట్స్మెన్లు, నాణ్యమైన ఆల్రౌండర్లు, అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అనుభవం పరంగా కూడా టీం బలంగా ఉందని మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసించారు. అయితే, టీ20 వరల్డ్ కప్లో భారత్కు అతిపెద్ద సవాల్ ఏంటో మహేంద్రుడు వెల్లడించారు.
Read Also: Megna Mukharjee: సౌరవ్ గంగూలీతో యాడ్లో నటించి.. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ!
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటి.. ఒక మంచి టీంలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని ఎంఎస్ ధోనీ తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సమతూకంగా ఉన్నప్పటికీ..ఈ ఫార్మాట్లో ఆడిన అనుభవం కూడా చాలా ఉంది.. ఒత్తిడిలోనూ ఆడగల సామర్థ్యం ఈ జట్టుకు ఉంది.. ప్రతి ఆటగాడు తన పాత్రను చాలా కాలంగా అదే స్థాయిలో నిర్వహిస్తున్నాడని చెప్పారు. అయితే, తనను ఎక్కువగా భయపెట్టేది మంచు (Dew) అని ఆయన స్పష్టం చేశారు. నాకు డ్యూ అంటే అస్సలు ఇష్టం లేదు.. ఈ మంచు మ్యాచ్ పరిస్థితులను పూర్తిగా మార్చేస్తుంది అన్నారు. డ్యూ ఉన్నప్పుడు టాస్ చాలా కీలకంగా మారుతుంది అని మహేంద్ర సింగ్ ధోని తెలియజేశారు.
Read Also: Astrology: ఫిబ్రవరి 4, బుధవారం దినఫలాలు..
అయితే, సమాన పరిస్థితుల్లో ప్రపంచంలోని ఉత్తమ జట్లతో 10 మ్యాచ్లు ఆడితే భారత్ ఎక్కువ మ్యాచ్లు గెలుస్తుందని మిస్టర్ కూల్ ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితులు మారితే, ముఖ్యంగా మంచు ప్రభావం ఉంటే, మ్యాచ్ ఫలితం పూర్తిగా మారిపోతుందని అన్నారు. టీ20 ఫార్మాట్లో టాప్ ఆర్డర్ ప్లేయర్లు విఫలమైతే లేదా ప్రత్యర్థి జట్టులో ఎవరో ఒకరు అసాధారణ ప్రదర్శన చేస్తే మ్యాచ్ చేతులు దాటిపోతుందని ఆయన హెచ్చరించారు. ఇది లీగ్ దశలో అయినా, నాకౌట్ దశలో అయినా జరగవచ్చని తెలిపారు. అందుకే అదృష్టం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, ఎవరికి గాయాలు కాకుండా, ప్రతి ఆటగాడు తనకు అప్పగించిన పాత్రను సరిగ్గా నిర్వర్తిస్తే టీమిండియా టైటిల్ నిలబెట్టుకోవడం సాధ్యమేనని ఎంఎస్ ధోనీ విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!