MS Dhoni: ఇట్లాంటి టీమిండియాను నేను ఇప్పటివరకు చూడలేదు.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త
- ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం..
- టీమిండియాను ప్రశంసించిన ఎంఎస్ ధోనీ..
- భారత్ ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి: ఎంఎస్ ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026 కోసం అన్ని జట్లు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 4-1తో ఘన విజయం సాధించిన భారత జట్టు తన సత్తాను మరోసారి నిరూపించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో టీమిండియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక, భారత జట్టులో విధ్వంసకర బ్యాట్స్మెన్లు, నాణ్యమైన ఆల్రౌండర్లు, అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అనుభవం పరంగా కూడా టీం బలంగా ఉందని మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసించారు. అయితే, టీ20 వరల్డ్ కప్లో భారత్కు అతిపెద్ద సవాల్ ఏంటో మహేంద్రుడు వెల్లడించారు.
Read Also: Megna Mukharjee: సౌరవ్ గంగూలీతో యాడ్లో నటించి.. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటి.. ఒక మంచి టీంలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని ఎంఎస్ ధోనీ తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సమతూకంగా ఉన్నప్పటికీ..ఈ ఫార్మాట్లో ఆడిన అనుభవం కూడా చాలా ఉంది.. ఒత్తిడిలోనూ ఆడగల సామర్థ్యం ఈ జట్టుకు ఉంది.. ప్రతి ఆటగాడు తన పాత్రను చాలా కాలంగా అదే స్థాయిలో నిర్వహిస్తున్నాడని చెప్పారు. అయితే, తనను ఎక్కువగా భయపెట్టేది మంచు (Dew) అని ఆయన స్పష్టం చేశారు. నాకు డ్యూ అంటే అస్సలు ఇష్టం లేదు.. ఈ మంచు మ్యాచ్ పరిస్థితులను పూర్తిగా మార్చేస్తుంది అన్నారు. డ్యూ ఉన్నప్పుడు టాస్ చాలా కీలకంగా మారుతుంది అని మహేంద్ర సింగ్ ధోని తెలియజేశారు.
Read Also: Astrology: ఫిబ్రవరి 4, బుధవారం దినఫలాలు..
అయితే, సమాన పరిస్థితుల్లో ప్రపంచంలోని ఉత్తమ జట్లతో 10 మ్యాచ్లు ఆడితే భారత్ ఎక్కువ మ్యాచ్లు గెలుస్తుందని మిస్టర్ కూల్ ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితులు మారితే, ముఖ్యంగా మంచు ప్రభావం ఉంటే, మ్యాచ్ ఫలితం పూర్తిగా మారిపోతుందని అన్నారు. టీ20 ఫార్మాట్లో టాప్ ఆర్డర్ ప్లేయర్లు విఫలమైతే లేదా ప్రత్యర్థి జట్టులో ఎవరో ఒకరు అసాధారణ ప్రదర్శన చేస్తే మ్యాచ్ చేతులు దాటిపోతుందని ఆయన హెచ్చరించారు. ఇది లీగ్ దశలో అయినా, నాకౌట్ దశలో అయినా జరగవచ్చని తెలిపారు. అందుకే అదృష్టం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, ఎవరికి గాయాలు కాకుండా, ప్రతి ఆటగాడు తనకు అప్పగించిన పాత్రను సరిగ్గా నిర్వర్తిస్తే టీమిండియా టైటిల్ నిలబెట్టుకోవడం సాధ్యమేనని ఎంఎస్ ధోనీ విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!