Rohit-Pant: రిషబ్ పంత్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ సీరియస్ (వీడియో)!
- భారత్కు వికెట్తో పనేలేదు
- పంత్ అత్యుత్సాహం
- రోహిత్ శర్మ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Frustrated on Rishabh Pant: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 దశలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బాగానే కష్టపడింది. చివరకు బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ ఓడిపోక తప్పలేదు. ఆసీస్ను చిత్తుగా ఓడించి.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనితో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురైయ్యాడు. పంత్పై రోహిత్ సీరియస్ అయ్యాడు.
ఆస్ట్రేలియా మ్యాచ్లో 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ విజయం ఖరారైంది. 20వ ఓవర్ను హార్దిక్ పాండ్యా వేశాడు. స్ట్రైకింగ్లో ఉన్న మిచెల్ స్టార్క్.. కమిన్స్కు స్ట్రైకింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బై రూపంలో సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న కీపర్ రిషబ్ పంత్.. వికెట్లకు వేగంగా త్రో విసిరాడు. బంతి కాస్త బౌలింగ్ ఎండ్లో ఉన్న హార్దిక్ చేతికి బలంగా తాకింది. దాంతో హార్దిక్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఏంటి ఇలా విసిరావ్ అన్నట్లు ఓ చూపు చూసాడు. ఆ సమయంలో భారత్కు వికెట్తో పనేలేదు కానీ పంత్ అత్యుత్సాహం చూపించాడు. ఇది చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ పంత్పై సీరియస్ అయ్యాడు. బంతిని అలా ఎందుకు విసిరావ్? అని సైగలు చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
Also Read: IND vs ENG Semi Final: భారత్, ఇంగ్లండ్ సెమీస్కు ‘నో రిజర్వ్ డే’.. కారణం ఏంటంటే?
ఐపీఎల్ 2024లో విఫలమైన హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం చెలరేగుతున్నాడు. బ్యాట్, బంతితోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతడు భారత్కు ప్రధాన బలంగా మారాడు. కీలక సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టును టీమిండియా ఢీకొన్సాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో హార్దిక్కు గాయమై జట్టుకు దూరమైతే.. అది టీమిండియాకు ప్రతికూలంగా మారుతుంది. అందుకే రిషబ్ పంత్పై రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు.
— Nihari Korma (@NihariVsKorma) June 25, 2024
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!