Gary Kirsten Pakistan: పాకిస్తాన్ అసలు జట్టే కాదు.. బాబర్ సేనపై చీఫ్ కోచ్ కిర్స్టన్ తీవ్ర విమర్శలు!
- గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్
- పాకిస్థాన్పై కిర్స్టన్ తీవ్ర విమర్శలు
- జట్టులో అందరూ విడిపోయారు
Gary Kirsten Comments on Pakistan Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్పై ఆ జట్టు చీఫ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ అసలు జట్టే కాదని, ఆ టీంలో ఐక్యత లేనే లేదన్నాడు. పాక్ జట్టులోని కీలక ఆటగాళ్ల మధ్య మాటలు లేవని, కొంతమంది ఆటగాళ్లు తీవ్రమైన ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపాడు. ఫిట్నెస్ సమస్యలే టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ వైఫల్యానికి ప్రధాన కారణం అని గ్యారీ కిర్స్టన్ చెప్పినట్లు పాకిస్థాన్కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.
‘పాకిస్తాన్ జట్టులో అసలు ఐక్యత లేదు. పాక్ జట్టు అని పిలుస్తారు కానీ అది జట్టే కాదు. ప్లేయర్స్ ఒకరికొకరు మద్దతుగా నిలవరు. జట్టులో అందరూ విడిపోయారు. గతంలో చాలా జట్లతో పనిచేశా. కానీ ఇలాంటి పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు. భారత్ చేతిలో ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ మైదానంలో 120 పరుగుల లక్ష్యం అంత ఈజీ కాదని తెలుసు. టీమిండియా 120 పరుగుల వద్దే ఆగిపోయిందంటే.. లక్ష్య ఛేదన కష్టమే. అయితే పాక్ 72/2తో ఉన్నప్పుడు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. అలాంటి స్థితి నుంచి మ్యాచ్ను కోల్పోవడం చాలా నిరాశ కలిగించింది’ అని గ్యారీ కిర్స్టన్ పేర్కొన్నాడు.
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
Also Read: Lockie Ferguson Record: ఫెర్గూసన్ సంచలన ప్రదర్శన.. 4 ఓవర్లు, 4 మెయిడెన్లు, 3 వికెట్లు!
టీ20 ప్రపంచకప్ 2024కు కావాల్సిన సామర్థ్యం పాకిస్తాన్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు లేదని, షాట్ సెలెక్షన్లో కొందరికి కనీస క్లారిటీ లేదని గ్యారీ కిర్స్టన్ విమర్శించినట్లు జియో న్యూస్ తమ కథనంలో పేర్కొంది. మెరుగైన ప్రదర్శన చేసే వారికే జట్టులో చోటు ఇవ్వాలని, జట్టు విజయం కోసం ఆడే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని పీసీబీ అధికారులతో కిర్స్టన్ అన్నట్లు తెలుస్తోంది. పేలవ ప్రదర్శన, గ్రూప్ రాజకీయాలు చేసే వారికి జట్టులో చోటు ఇవ్వొద్దని సెలెక్టర్లకు సూచించినట్లు సమాచారం. ఇక టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా, భారత్ చేతిలో ఓడిన పాక్.. కెనడా, ఐర్లాండ్పై గెలిచినా సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో