Gary Kirsten Pakistan: పాకిస్తాన్ అసలు జట్టే కాదు.. బాబర్ సేనపై చీఫ్ కోచ్ కిర్స్టన్ తీవ్ర విమర్శలు!
- గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్
- పాకిస్థాన్పై కిర్స్టన్ తీవ్ర విమర్శలు
- జట్టులో అందరూ విడిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gary Kirsten Comments on Pakistan Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్పై ఆ జట్టు చీఫ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ అసలు జట్టే కాదని, ఆ టీంలో ఐక్యత లేనే లేదన్నాడు. పాక్ జట్టులోని కీలక ఆటగాళ్ల మధ్య మాటలు లేవని, కొంతమంది ఆటగాళ్లు తీవ్రమైన ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపాడు. ఫిట్నెస్ సమస్యలే టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ వైఫల్యానికి ప్రధాన కారణం అని గ్యారీ కిర్స్టన్ చెప్పినట్లు పాకిస్థాన్కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.
‘పాకిస్తాన్ జట్టులో అసలు ఐక్యత లేదు. పాక్ జట్టు అని పిలుస్తారు కానీ అది జట్టే కాదు. ప్లేయర్స్ ఒకరికొకరు మద్దతుగా నిలవరు. జట్టులో అందరూ విడిపోయారు. గతంలో చాలా జట్లతో పనిచేశా. కానీ ఇలాంటి పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు. భారత్ చేతిలో ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ మైదానంలో 120 పరుగుల లక్ష్యం అంత ఈజీ కాదని తెలుసు. టీమిండియా 120 పరుగుల వద్దే ఆగిపోయిందంటే.. లక్ష్య ఛేదన కష్టమే. అయితే పాక్ 72/2తో ఉన్నప్పుడు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. అలాంటి స్థితి నుంచి మ్యాచ్ను కోల్పోవడం చాలా నిరాశ కలిగించింది’ అని గ్యారీ కిర్స్టన్ పేర్కొన్నాడు.
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
Also Read: Lockie Ferguson Record: ఫెర్గూసన్ సంచలన ప్రదర్శన.. 4 ఓవర్లు, 4 మెయిడెన్లు, 3 వికెట్లు!
టీ20 ప్రపంచకప్ 2024కు కావాల్సిన సామర్థ్యం పాకిస్తాన్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు లేదని, షాట్ సెలెక్షన్లో కొందరికి కనీస క్లారిటీ లేదని గ్యారీ కిర్స్టన్ విమర్శించినట్లు జియో న్యూస్ తమ కథనంలో పేర్కొంది. మెరుగైన ప్రదర్శన చేసే వారికే జట్టులో చోటు ఇవ్వాలని, జట్టు విజయం కోసం ఆడే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని పీసీబీ అధికారులతో కిర్స్టన్ అన్నట్లు తెలుస్తోంది. పేలవ ప్రదర్శన, గ్రూప్ రాజకీయాలు చేసే వారికి జట్టులో చోటు ఇవ్వొద్దని సెలెక్టర్లకు సూచించినట్లు సమాచారం. ఇక టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా, భారత్ చేతిలో ఓడిన పాక్.. కెనడా, ఐర్లాండ్పై గెలిచినా సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది.
తాజావార్తలు
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
-
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
-
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!