PAK vs CAN: కెనడాపై విజయం.. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ బోణీ!
- ప్రపంచకప్లో పాకిస్థాన్ బోణీ
- అరోన్ జాన్సన్ ఒంటరి పోరాటం
- మహ్మద్ రిజ్వాన్ అర్ధ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan 1st Victory in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. మంగళవారం గ్రూప్-ఏ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పనికూన కెనడాపై గెలిచింది. కెనడా నిర్ధేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (33; 33 బంతుల్లో 1×4, 1×6) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గ్రూప్-ఏలో భాగంగా ఆడిన మూడు మ్యాచ్లలో పాకిస్తాన్ రెండు ఓడి.. ఒకటి గెలిచింది. మిగిలిన మ్యాచ్లో గెలిచినా.. పాక్ సూపర్-8 చేరుకునే అవకాశాలు తక్కువ. గ్రూప్-ఏ భారత్, అమెరికా అగ్రస్థానాల్లో ఉన్నాయి.
ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్ అరోన్ జాన్సన్ (52; 44 బంతుల్లో 4×4, 4×6) ఒంటరి పోరాటం చేశాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన జాన్సన్.. 14వ ఓవర్లో జట్టు స్కోరు 73 పరుగుల వద్ద ఆరో వికెట్గా నిష్క్రమించాడు. 73 పరుగులలో ఆరోన్ ఒక్కడి స్కోరే 52 పరుగులు కావడం విశేషం. నవ్నీత్ (4), పర్గత్ (2), నికోలస్ (1), మొవ్వ శ్రేయస్ (2), రవీందర్పాల్ (0) నిరాశపరిచారు. సాద్ బిన్ జాఫర్ (10), కలీమ్ (13 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్, మొహమ్మద్ ఆమిర్ చెరో 2 వికెట్లు తీశారు.
Also Read
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
Also Read: Astrology: జూన్ 12, బుధవారం దినఫలాలు
ఛేదనలో పాక్ ఓపెనర్ సయిమ్ అయూబ్ (6) విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యతను మహ్మద్ రిజ్వాన్ (53 నాటౌట్; 53 బంతుల్లో 2×4, 1×6) తీస్కున్నాడు. బాబర్ అజామ్ అండతో జట్టును స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్కు 63 పరుగులు జోడించాడు. ఆజామ్ను ఔట్ చేసిన హెలిజర్.. ఈ జంటను విడగొట్టాడు. పాక్ విజయానికి 30 బంతుల్లో 22 రన్స్ అవసరం అవ్వడంతో పాక్ కంగారుపడలేదు. దూకుడుగా ఆడిన రిజ్వాన్ మిగతా పని పూర్తి చేశాడు. దాంతో 15 బంతులు మిగిలుండగానే పాక్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!