T20 World Cup Controversy: మూడు వారాల్లో టీ20 వరల్డ్ కప్.. భారత ఐసీసీ అధికారికి దొరకని బంగ్లాదేశ్ వీసా
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ కీలక చర్చలు..
- భారత ఐసీసీ అధికారికి లభించని బంగ్లాదేశ్ వీసా..
- మూడు వారాల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుండటంతో ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup Controversy: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ చర్చల సందర్భంగా అనుకోని అడ్డంకితో మళ్లీ వివాదం ప్రారంభమైంది. ఢాకాకు వెళ్లాల్సిన ఐసీసీ ప్రతినిధి బృందం, వీసా సమస్యల కారణంగా ఒక్కరికి పరిమితమైంది. ఐసీసీ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ విభాగం అధిపతి ఆండ్రూ ఎఫ్గ్రేవ్ ఈరోజు (జనవరి 17న) ఒంటరిగానే బంగ్లా రాజధాని ఢాకాకు చేరుకున్నారు. అయితే, భారతీయ పౌరసత్వం కలిగిన మరో సీనియర్ ఐసీసీ అధికారికి సమయానికి వీసా రాకపోవడంతో ప్రయాణం రద్దు చేసుకోవాల్సిన పరిస్థతి ఏర్పడింది.
Read Also: PM Modi: తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించిన మోడీ
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
కాగా, ఈ పర్యటనను ఐసీసీ చివరి ప్రయత్నంగా భావిస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనే విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ చర్చలు కీలకంగా మారాయి. భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ తమ జట్టు భారత్లో ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని అధికారికంగా కోరాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతపై ఉన్న ఆందోళనలే ఈ డిమాండ్కు ప్రధాన కారణమని పేర్కొన్నాయి.
Read Also: Tamil Nadu Elections: పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. మ్యానిఫెస్టో విడుదల చేసిన ఏఐఏడీఎంకే
ఇక, ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రూ ఎఫ్గ్రేవ్ భుజాలపై మొత్తం బాధ్యత పడింది. అంతర్జాతీయ క్రీడా భద్రత రంగంలో అనుభవం కలిగిన మాజీ బ్రిటిష్ పోలీస్ అధికారి అయిన ఎఫ్గ్రేవ్, భారత్లో బంగ్లాదేశ్ జట్టుకు పటిష్టమైన భద్రత కల్పించేందుకు ఐసీసీ సిద్ధంగా ఉందని వివరించే సమగ్ర భద్రతా ప్రణాళికను బీసీబీకి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికతో బంగ్లాదేశ్ అధికారుల ఆందోళనలను తొలగించాలని ఐసీసీ ఆశిస్తోంది.
Read Also: Lava Blaze Duo 3 స్మార్ట్ఫోన్ లాంచ్.. AMOLED డిస్ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్
కాగా, ఇదిలా ఉంటే, భారతీయ పౌరసత్వం కలిగిన ఐసీసీ అధికారి వీసా పొందలేకపోవడం భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ వీసా అంశంపై ఐసీసీ అధికారికంగా స్పందించకపోయినా, సంస్థలో అసంతృప్తి నెలకున్నట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా మూడు వారాల సమయం కూడా లేకపోవడంతో.. ఈ వివాదం త్వరగా పరిష్కారం అవుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఆండ్రూ ఎఫ్గ్రేవ్ బంగ్లాదేశ్ను ఒప్పించడంలో విఫలమైతే, టోర్నమెంట్ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని క్రీడా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒక్క బంతి పడక ముందే ప్రపంచ కప్ భవితవ్యం ఈ చర్చలపై ఆధారపడటం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!