T20 World Cup Controversy: మూడు వారాల్లో టీ20 వరల్డ్ కప్.. భారత ఐసీసీ అధికారికి దొరకని బంగ్లాదేశ్ వీసా
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ కీలక చర్చలు..
- భారత ఐసీసీ అధికారికి లభించని బంగ్లాదేశ్ వీసా..
- మూడు వారాల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుండటంతో ఉత్కంఠ..
T20 World Cup Controversy: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ చర్చల సందర్భంగా అనుకోని అడ్డంకితో మళ్లీ వివాదం ప్రారంభమైంది. ఢాకాకు వెళ్లాల్సిన ఐసీసీ ప్రతినిధి బృందం, వీసా సమస్యల కారణంగా ఒక్కరికి పరిమితమైంది. ఐసీసీ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ విభాగం అధిపతి ఆండ్రూ ఎఫ్గ్రేవ్ ఈరోజు (జనవరి 17న) ఒంటరిగానే బంగ్లా రాజధాని ఢాకాకు చేరుకున్నారు. అయితే, భారతీయ పౌరసత్వం కలిగిన మరో సీనియర్ ఐసీసీ అధికారికి సమయానికి వీసా రాకపోవడంతో ప్రయాణం రద్దు చేసుకోవాల్సిన పరిస్థతి ఏర్పడింది.
Read Also: PM Modi: తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించిన మోడీ
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
కాగా, ఈ పర్యటనను ఐసీసీ చివరి ప్రయత్నంగా భావిస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనే విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ చర్చలు కీలకంగా మారాయి. భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ తమ జట్టు భారత్లో ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని అధికారికంగా కోరాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతపై ఉన్న ఆందోళనలే ఈ డిమాండ్కు ప్రధాన కారణమని పేర్కొన్నాయి.
Read Also: Tamil Nadu Elections: పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. మ్యానిఫెస్టో విడుదల చేసిన ఏఐఏడీఎంకే
ఇక, ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రూ ఎఫ్గ్రేవ్ భుజాలపై మొత్తం బాధ్యత పడింది. అంతర్జాతీయ క్రీడా భద్రత రంగంలో అనుభవం కలిగిన మాజీ బ్రిటిష్ పోలీస్ అధికారి అయిన ఎఫ్గ్రేవ్, భారత్లో బంగ్లాదేశ్ జట్టుకు పటిష్టమైన భద్రత కల్పించేందుకు ఐసీసీ సిద్ధంగా ఉందని వివరించే సమగ్ర భద్రతా ప్రణాళికను బీసీబీకి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికతో బంగ్లాదేశ్ అధికారుల ఆందోళనలను తొలగించాలని ఐసీసీ ఆశిస్తోంది.
Read Also: Lava Blaze Duo 3 స్మార్ట్ఫోన్ లాంచ్.. AMOLED డిస్ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్
కాగా, ఇదిలా ఉంటే, భారతీయ పౌరసత్వం కలిగిన ఐసీసీ అధికారి వీసా పొందలేకపోవడం భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ వీసా అంశంపై ఐసీసీ అధికారికంగా స్పందించకపోయినా, సంస్థలో అసంతృప్తి నెలకున్నట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా మూడు వారాల సమయం కూడా లేకపోవడంతో.. ఈ వివాదం త్వరగా పరిష్కారం అవుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఆండ్రూ ఎఫ్గ్రేవ్ బంగ్లాదేశ్ను ఒప్పించడంలో విఫలమైతే, టోర్నమెంట్ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని క్రీడా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒక్క బంతి పడక ముందే ప్రపంచ కప్ భవితవ్యం ఈ చర్చలపై ఆధారపడటం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో