PM Modi: తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించిన మోడీ
- తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించిన మోడీ
- హౌరా నుంచి గౌహతి మధ్య పరుగులు పెట్టనున్న ట్రైన్
- త్వరలో బెంగాల్, అస్సాంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. తొలి ట్రైన్ హౌరా నుంచి గౌహతికి ప్రారంభమైంది. త్వరలో పశ్చిమ బెంగాల్, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇక వందే భారత్ స్లీపర్ రైల్లో విద్యార్థులతో మోడీ ముచ్చటించారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu Elections: పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. మ్యానిఫెస్టో విడుదల చేసిన ఏఐఏడీఎంకే
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
త్వరలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రైలు ప్రారంభోత్సవానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవాలని డిజైన్ చేసినప్పటికీ ప్రస్తుతం గరిష్టంగా గంటలకు 120-130 కిలోమీటర్ల వేగంతో నడవనుంది. ఇక దాదాపు విమాన ఛార్జీలు మాదిరిగానే వసూలు చేయనున్నారు. సౌకర్యాలు కూడా అదే మాదిరిగా ఉండనున్నాయి. బెర్తులు ఎర్గోనామిక్ డిజైన్లను కలిగి ఉంటాయి. అసాధారణమైన మృదువైన ప్రయాణాన్ని అందించనుంది.
స్థానిక వంటకాలు అందుబాటులో..
వేగం, పరిశుభ్రత, భద్రతతో పాటు ఈ రైలు ప్రీమియం ఎయిర్లైన్ సేవల మాదిరిగానే స్థానిక ఆహారాన్ని ప్రయాణీకులకు అందిస్తుంది. క్యాటరింగ్ టికెట్ ధరలో ఉంటుంది. స్థానిక రుచులు, వంటకాలపై దృష్టి పెడుతుంది. కామాఖ్య నుంచి హౌరాకు ప్రయాణించే ప్రయాణీకులకు అస్సామీ వంటకాలు వడ్డిస్తారు. హౌరా నుంచి కామాఖ్యకు తిరుగు ప్రయాణంలో ఉన్నవారు బెంగాలీ వంటకాలను ఆస్వాదించనున్నారు.
#WATCH | Malda, West Bengal: PM Narendra Modi flags off India’s first Vande Bharat Sleeper Train between Howrah and Guwahati (Kamakhya)
(Source: DD) pic.twitter.com/lQkE5g6gCa
— ANI (@ANI) January 17, 2026
తాజావార్తలు
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!