T20 World Cup 2024: ఉన్నపళంగా స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
- ఫ్లోరిడాలో కెనడాతో మ్యాచ్
- కరేబియన్ దీవులకు రోహిత్ సేన
- స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill and Avesh Khan Out Form T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-ఏ నుంచి భారత్ సూపర్ 8కు దూసుకెళ్లింది. లీగ్ స్టేజ్లో కెనడాతో శనివారం చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే.. టేబుల్ టాపర్గా టీమిండియా లీగ్ దశను ముగిస్తుంది. ఫ్లోరిడాలో కెనడాతో మ్యాచ్ అనంతరం కరేబియన్ దీవులకు రోహిత్ సేన పయనమవుతుంది. సూపర్-8, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ అక్కడే ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఫ్లోరిడా నుంచి భారత జట్టు వెస్టిండీస్కు బయలుదేరనుండగా.. శుభ్మన్ గిల్, అవేశ్ ఖాన్ మాత్రం స్వదేశానికి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024లో గిల్, అవేశ్తో పాటు రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. 15 మంది ఆటగాళ్లలో ఎవరైనా గాయపడితే.. వీరికి అవకాశం దక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్నాడు. దాంతో యశస్వీ జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్గా బెంచ్కు పరిమితమవుంటున్నాడు. దీంతో ప్రపంచకప్లో గిల్ సేవలు అవసరం లేదని భావించిన టీమ్ మేనేజ్మెంట్ అతన్ని స్వదేశానికి పంపించడానికి సిద్ధమైంది.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!
వెస్టిండీస్లో పిచ్లు స్పిన్నర్లుకు అనుకూలం. దీంతో భారత్ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రాతో అర్షదీప్ సింగ్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొహమ్మద్ సిరాజ్ బెంచ్కు పరిమితం అవుతాడు. హార్దిక్ కూడా కూడా ఫాస్ట్ బౌలర్గా ఉపయోగపడనున్నాడు. దీంతో ఓ ఫాస్ట్ బౌలర్ గాయపడినా.. అవేశ్తో అవసరం ఉండదని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఖలీల్ అహ్మద్, రింకూ సింగ్ రిజర్వ్ ప్లేయర్గా జట్టుతో పాటే ఉండనున్నారు.
తాజావార్తలు
-
Neel – Mahesh : ఊహించని కాంబో.. నిజమైతే మాత్రం..?
-
Tollywood : ఎగ్జిబిటర్స్ vs గిల్డ్ నిర్మాతల వివాదం.. నేడు పవర్ స్టార్ తో గిల్డ్ నిర్మాతలు కీలక సమావేశం
-
Trump-Pakistan: పాకిస్థాన్కు ఊహించని సిట్యుయేషన్.. ట్రంప్ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన పాక్..
-
Yash Dayal-RCB: ఆర్సీబీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో.. చాలా బాధగా ఉంది.. యశ్ దయాల్ సంచలన వ్యాఖ్యలు!
-
Chennai Love Story: ఎంఎం కీరవాణి చేతుల మీదుగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి ‘వదలనే..’ పాట విడుదల
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!