T20 World Cup: యూ-టర్న్ డ్రామా.. పాకిస్తాన్ను ఐసీసీ ఎలా దారికి తెచ్చింది..?
- ఎట్టకేలకు పాకిస్తాన్ బాయ్కాట్ డ్రామాకు తెర..
- పీసీబీని దారికి తెచ్చిన ఐసీసీ..
- ఈ నెల 15న ఇండియా వర్సెస్ పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వివాదానికి తెర పడింది. ఎట్టకేటకు పాకిస్తాన్ యూ-టర్న్ తీసుకుంది. బంగ్లాదేశ్ బహిష్కరణకు సంఘీభావంగా తాము కొలంబో వేదికగా ఈ నెల 15న ఇండియాతో జరగబోయే మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని హెచ్చరించింది. ఎట్టకేలకు ఆర్థిక లెక్కలు, ఆంక్షలు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుని చివరకు భారత్తో మ్యాచ్కు సిద్ధమైంది.
ఈ మొత్తం పరిణామాల్లో ఐసీసీ కీలకంగా వ్యవహరించింది. పాకిస్తాన్ దారికొచ్చేలా పనిచేసింది. ఐసీసీతో పాటు తోటి సభ్య దేశాల బోర్డులు కూడా పాక్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. పాక్ బాయ్ కాట్ చేస్తే ఆ దేశ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టంతో పాటు ఇతర దేశాల బోర్డుల ఆదాయం కూడా దెబ్బతింటుందని చెప్పింది. చివరకు ఏ బంగ్లాదేశ్ కోసం పాక్ బాయ్ కాట్ నాటకాన్ని ఆడిందో, చివరకు ఆ బంగ్లాదేశ్ భారత్తో మ్యాచ్ ఆడాల్సిందిగా పాక్ను కోరింది.
Also Read
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
జనవరి 25 – 30: భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్ భారత్లో ఆటడానికి నిరాకరించింది. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బంగ్లాను బహిష్కరిస్తే తాము కఠిన నిర్ణయం తీసుకోవచ్చని పాక్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ అన్నారు.
ఫిబ్రవరి 1: భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఆర్థిక జరిమానాలు, ఆంక్షల గురించి పాక్కు ఐసీసీ స్పష్టమైన హెచ్చరిక చేసింది.
ఫిబ్రవరి 3: ఐసీసీ బెదిరింపుల నుంచి చర్చలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ ముబాషిర్ ఉస్మానీ, మోహ్సీన్ నఖ్వీతో వరసగా సమావేశాలు నిర్వహించారు. ప్రసార ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని, ఇతర బోర్డుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.
ఫిబ్రవరి 5: శ్రీలంక క్రికెట్ (SLC) అధ్యక్షుడు షమ్మీ సిల్వా PCBకి అధికారిక లేఖతో రంగంలోకి దిగారు. కొలంబోలో హై ఓల్టేజ్ మ్యాచ్ రద్దయితే, శ్రీలంక ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని చెప్పారు. పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరవుతున్న సమయంలో శ్రీలంక తన పర్యటన ద్వారా ఎలా మద్దతు ఇచ్చిందనే విషయాన్ని పాకిస్తాన్కు గుర్తు చేశారు.
ఫిబ్రవరి 7: నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత, పీసీబీ ‘‘ఫోర్స్ మజురే’’ నిబంధనలు అమలు చేయాలని ఐసీసీకి అధికారికంగా తెలియజేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత్లో ఆడకుండా ఉంటున్నామని మోహ్సిన్ నఖ్వీ వాదించారు. ఐసీసీ ఈ అభ్యర్థనను తెలియజేసింది. ప్రభుత్వం చర్చలు జరిపారా.? అని నిలదీసింది.
ఫిబ్రవరి 8: నఖ్వీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాంతో కీలక సమావేశం కోసం ఇమ్రాన్ ఖ్వాజా లాహోర్ చేరుకున్నాడు.
ఫిబ్రవరి 9: పాక్ బహిష్కరణ ఐసీసీ ఆదాయంతో పాటు ఇతర బోర్డులకు ఇచ్చే వార్షిక ఆదాయంపై తీవ్ర ప్రభావం చూసిస్తుందని యూఏఈ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా క్రికెట్ ఎకో సిస్టమ్ కోసం పాక్ భారత్తో మ్యాచ్ ఆడాలని కోరింది. చివరకు సాయంత్రం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తన దేశ జట్టు ఫిబ్రవరి 15న ఆడటానికి అనుమతి ఇచ్చారు.
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!