T20 World Cup match: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. గేమ్ఛేంజర్గా శ్రీలంక..
- భారత్-పాక్ మ్యాచ్కు మార్గం సుగమం..
- కొలంబో వేదికగా ఈ నెల 15న మ్యాచ్..
- గేమ్ఛేంజర్గా వ్యవహరించిన శ్రీలంక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup match: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ముగిశాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈనెల 15న కొలంబో వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగబోతోంది. బంగ్లాదేశ్ భద్రతా కారణాలు చూపుతూ భారత్లో ఆడేందుకు నిరాకరించడం, బంగ్లాదేశ్ను ఐసీసీ టోర్నీ నుంచి తీసేసి, ఆ స్థానంలో స్కాట్లాండ్ ను తీసుకోవడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిరసన వ్యక్తం చేసింది. దీంతో పాటు భారత్తో మ్యాచ్ ను బహిష్కరించింది.
అయితే, ఎట్టకేటకు చర్చోపచర్చల తర్వాత పాక్ భారత్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఐసీసీ ఆంక్షలు, ఆర్థిక నష్టం భయాలు పాక్ యూ-టర్న్కు ఒక కారణం కాగా, మొత్తం వివాదంలో గేమ్ ఛేంజర్గా శ్రీలంక నిలిచింది. ఈ మ్యాచ్పై శ్రీలంక భారీ ఆశలు పెట్టుకుంది. ఒక వేళ ఈ మ్యాచ్ జరగకపోతే ఆ దేశం ఆర్థికం నష్టపోయేది. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్కు భారీ క్రేజ్ ఉంటుంది. ఇటు భారత్, అటు పాక్ నుంచి భారీగా ప్రేక్షకులు తరలివస్తారు. శ్రీలంక ఆతిథ్య రంగం భారీగా క్యాష్ చేసుకుంటుంది.
Also Read
- IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
- Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్కు ఎంఎస్ ధోనీ గుడ్బై!
Read Also: Operation Sindoor: భారత్ దాడి చేస్తుంటే, పాక్ సైన్యం నమాజ్ చేసింది..
ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగేలా శ్రీలంక చర్చలు నిర్వహించింది. సోమవారం రాత్రి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయక, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఫోన్లో చర్చలు జరిగాయి. ఈ మ్యాచ్ జరిగేలా శ్రీలంక కృషి చేసింది. శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం (ఫిబ్రవరి 8) కొలంబో, ఇస్లామాబాద్లోని రెండు హైకమిషన్ల ద్వారా పాకిస్తాన్ అధికారులను సంప్రదించింది. ఇరు దేశాల దేశాధినేతల మద్య సుమారు 30 నిమిషాలు ఫోన్ సంభాషణ జరిగినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ మంగళవారం ఉదయం తెలిపారు. ఇది క్రికెట్ దౌత్యం అని అన్నారు.
శ్రీలంక మాత్రమే కాకుండా బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీసీ) యూఏఈ క్రికెట్ బోర్డులు కూడా మ్యాచ్ ఆడేలా పాక్పై ఒత్తిడి తెచ్చాయి. దీంతో సోమవారం భారత్తో మ్యాచ్ ఆడుతామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే మ్యాచ్ జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..