Shoaib Akhtar: ‘నో బాల్’ వివాదం.. షోయబ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Akhtar Sensational Comments On No Ball: నిన్న పాకిస్తాన్పై భారత్ సాధించిన అఖండ విజయం సంగతిని పక్కన పెడితే.. చివరి ఓవర్లో మహ్మద్ నవాజ్ వేసిన ‘నో బాల్’పై ఇప్పటికీ దుమారం రేగుతూనే ఉంది. ముఖ్యంగా.. పాకిస్తాన్ ప్రేక్షకులైతే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అది నో బాల్ కాకపోయినా.. విరాట్ కోహ్లీ ఒత్తిడి చేయడంతో అంపైర్లు నో బాల్ ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు. భారత్ మోసం చేసి, ఈ మ్యాచ్ గెలిచిందని తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. చివర్లో దౌర్జన్యంగా పరుగులు లాక్కొని.. పాక్ సాధించాల్సిన విజయాన్ని, భారత్ దోచుకుందంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
తాజాగా వీరి జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అఖ్తర్ కూడా చేరిపోయాడు. ఆ నో బాల్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘అంపైర్ భయ్యో.. ఈ రాత్రికి మీకు భోజనం పక్కా’’ అంటూ ఆ నో బాల్కి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ షోయబ్ ట్వీట్ చేశాడు. ఇక్కడ షోయబ్ ట్వీట్ని గమనిస్తే.. అంప్లైర్లు మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడ్డారని, ఆ డబ్బులు అందాయి కాబట్టే నో బాల్ కాకున్నా నో బాల్ ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. క్రికెట్లో ఎంతో అనుభవం కలిగిన షోయబ్ లాంటి ఆటగాడు.. ఇలాంటి కామెంట్ చేయడం నిజంగా దారుణం. ఫీల్డ్లో అంపైర్లు ఇచ్చిన నిర్ణయాన్ని గౌరవించాలన్న విషయం షోయబ్కి తెలియదా? విమర్శించడం వేరు కానీ, మరీ మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడ్డారనే భావన వచ్చేలా వ్యాఖ్యానించడం నిజంగా అవమానకరం.
Also Read
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
అంతకుముందు మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు బ్రాడ్ హాగ్ కూడా ఈ నో బాల్పై ప్రశ్నలు సంధించాడు. ‘‘అంప్లైర్లు దానిని ‘నో-బాల్’గా ప్రకటించడానికి ముందు ఎందుకు రివ్యూ తీసుకోలేదు? ఫ్రీ హిట్ బాల్కు కోహ్లి బౌల్డ్ అయినప్పుడు.. దాన్ని డెడ్ బాల్గా ఎందుకు ప్రకటించలేదు?’’ అని ప్రశ్నించాడు. కాగా.. ఏ నో బాల్ గురించైతే ఇంతలా చర్చలు జరుగుతున్నాయో, దాని వల్లే మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అది నో బాల్ ఇవ్వడం వల్లే.. మరో బంతి జత కావడం, ఫ్రీ హిట్ కారణంగా కోహ్లీ ఔటైనా సేఫ్ అవ్వడం జరిగాయి. ఫలితంగా.. మ్యాచ్ భారత్ గెలిచేసింది.
Umpire bhaiyo, food for thought aaj raat k liye 😉 pic.twitter.com/vafnDG0EVd
— Shoaib Akhtar (@shoaib100mph) October 23, 2022
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!