U19 World Cup: సచిన్ చేతుల మీదుగా అండర్-19 విమెన్స్ టీమ్కు సత్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటిసారి నిర్వహించిన అండర్-19 మహిళల ప్రపంచకప్ విజేతగా నిలచిన టీమిండియా జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆటగాళ్లకు నజరానాలూ ప్రకటిస్తున్నారు.ఇప్పటికే జట్టులోని సభ్యులు, రూ. 5 కోట్లను నజరానాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో భారత క్రీడాకారిణులను ప్రత్యేకంగా సత్కరించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది.
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. మ్యాచ్కు ముందు అండర్-19 మహిళల ప్రపంచకప్ విజేతలను సత్కరిస్తామని బీసీసీఐ వెల్లడించింది. నేడు దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి భారత మహిళల అండర్ -19 జట్టు చేరుకొంటుంది. “అండర్ -19 మహిళల ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్ జట్టు సభ్యులకు సచిన్ టెండూల్కర్, బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 1 సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది” అని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
Also Read
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
Union Budget 2023: రాబోయే పాతికేళ్లు ఎంతో కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇటీవల జరిగిన అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు విశ్వవిజేతగా మారిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్తో జరిగిన ఫైనల్లో సులభంగా గెలిచిన భారత అమ్మాయిలు.. ప్రపంచకప్ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో వీరిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోమవారం నాడు టీమిండియా మహిళా జట్టు ముంబయికి చేరుకుంది. అక్కడ నుంచి సరాసరి సన్మాన కార్యక్రమం కోసం అహ్మదాబాద్ బయల్దేరింది. బుధవారం నాడు ఈ కార్యక్రమం జరగనుంది.
షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత అండర్ 19 జట్టు విశ్వవిజేతగా నిలిచింది. భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్తో జరిగిన ఈ ఫైనల్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 17.1 ఓవర్లో కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు టైటాస్ సధు, అర్చనా దేవి, ప్రశవి చోప్రా ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. అనంతరం లక్ష్య ఛేదనంలో భారత అమ్మాయిలు 3 వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. సౌమ్యా తివారీ(24), గొంగడి త్రిష(24) ఆకట్టుకునే ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!