RCB vs DC: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. డీసీ లక్ష్యం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Challengers Bangalore Scored 181 In First 20 Overs: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (55), లామ్రోర్ (54) అర్థశతకాలతో చెలరేగడం.. డు ప్లెసిస్ (45) బాగా రాణించడంతో.. ఆర్సీబీ అంత స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ డీసీ గెలుపొందాలంటే.. 182 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది. మరి.. డీసీ ఛేధించగలుగుతుందా? లేక ఆర్సీబీ బౌలర్లు లక్ష్యాన్ని ఛేధించకుండా వారిని కట్టడి చేయగలుగుతారా? అనేది ఇంకాసేపట్లో తేలిపోతుంది.
Companies: అత్యధిక ఉద్యోగులు కలిగిన టాప్-10 కంపెనీలు
Also Read
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్కు పండగే..
- ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ పాకిస్థాన్ స్టార్పై నిషేధం.. ఎందుకంటే..?

ఆర్సీబీ తరఫున ఓపెనింగ్ చేసిన విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్.. మొదట్లో నిదానంగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రమంగా డు ప్లెసిస్ జోరందుకోగా.. కోహ్లీ మాత్రం స్లోగానే ఆడుతూ వచ్చాడు. వీళ్లిద్దరు కలిసి తొలి వికెట్కి 82 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. డు ప్లెసిస్ ఒక భారీ షాట్ కొట్టబోగా, బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే మ్యాక్స్వెల్ వికెట్ కీపర్గా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పుడు వచ్చిన లామ్రోర్.. వచ్చి రావడంతోనే మోత మోగించడం స్టార్ట్ చేశాడు. ఈ సీజన్లో పెద్దని రాణించని అతడు.. ఈసారి తనకు మంచి అవకాశం దక్కడంతో చెలరేగి ఆడాడు. ఎడాపెడా షాట్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవైపు కోహ్లీ సింగిల్స్, డబుల్స్ తీస్తుంటే.. మరోవైపు లామ్రోర్ పరుగుల సునామీ సృష్టించాడు. వీళ్లిద్దరు మూడో వికెట్కి 55 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
Harish Rao : పని చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి… సద్దితిన్న రేవు తలవాలి
ఇంతలో కోహ్లీ ఔట్ అవ్వగా.. దినేశ్ కార్తిక్ రంగంలోకి దిగాడు. ఈసారి కూడా కార్తిక్ ఏమంత ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేదు. కేవలం 11 పరుగులకే అతడు దుకాణం సర్దేశాడు. చివరి రెండు ఓవర్లను డీసీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. భారీ పరుగులు రాలేదు. లాస్ట్ రెండు ఓవర్లలో కేవలం 15 పరుగులే వచ్చాయి. 19వ ఓవర్లో ముకేశ్ 6 పరుగులే ఇవ్వగా.. 20వ ఓవర్లో ఖలీల్ 9 పరుగులే ఇచ్చాడు. దీంతో.. ఆర్సీబీ 200 పరుగుల మార్క్ని అందుకోలేకపోయింది. 181 పరుగులతోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?