RCB vs DC: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. డీసీ లక్ష్యం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Challengers Bangalore Scored 181 In First 20 Overs: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (55), లామ్రోర్ (54) అర్థశతకాలతో చెలరేగడం.. డు ప్లెసిస్ (45) బాగా రాణించడంతో.. ఆర్సీబీ అంత స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ డీసీ గెలుపొందాలంటే.. 182 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది. మరి.. డీసీ ఛేధించగలుగుతుందా? లేక ఆర్సీబీ బౌలర్లు లక్ష్యాన్ని ఛేధించకుండా వారిని కట్టడి చేయగలుగుతారా? అనేది ఇంకాసేపట్లో తేలిపోతుంది.
Companies: అత్యధిక ఉద్యోగులు కలిగిన టాప్-10 కంపెనీలు
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..

ఆర్సీబీ తరఫున ఓపెనింగ్ చేసిన విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్.. మొదట్లో నిదానంగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రమంగా డు ప్లెసిస్ జోరందుకోగా.. కోహ్లీ మాత్రం స్లోగానే ఆడుతూ వచ్చాడు. వీళ్లిద్దరు కలిసి తొలి వికెట్కి 82 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. డు ప్లెసిస్ ఒక భారీ షాట్ కొట్టబోగా, బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే మ్యాక్స్వెల్ వికెట్ కీపర్గా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పుడు వచ్చిన లామ్రోర్.. వచ్చి రావడంతోనే మోత మోగించడం స్టార్ట్ చేశాడు. ఈ సీజన్లో పెద్దని రాణించని అతడు.. ఈసారి తనకు మంచి అవకాశం దక్కడంతో చెలరేగి ఆడాడు. ఎడాపెడా షాట్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవైపు కోహ్లీ సింగిల్స్, డబుల్స్ తీస్తుంటే.. మరోవైపు లామ్రోర్ పరుగుల సునామీ సృష్టించాడు. వీళ్లిద్దరు మూడో వికెట్కి 55 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
Harish Rao : పని చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి… సద్దితిన్న రేవు తలవాలి
ఇంతలో కోహ్లీ ఔట్ అవ్వగా.. దినేశ్ కార్తిక్ రంగంలోకి దిగాడు. ఈసారి కూడా కార్తిక్ ఏమంత ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేదు. కేవలం 11 పరుగులకే అతడు దుకాణం సర్దేశాడు. చివరి రెండు ఓవర్లను డీసీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. భారీ పరుగులు రాలేదు. లాస్ట్ రెండు ఓవర్లలో కేవలం 15 పరుగులే వచ్చాయి. 19వ ఓవర్లో ముకేశ్ 6 పరుగులే ఇవ్వగా.. 20వ ఓవర్లో ఖలీల్ 9 పరుగులే ఇచ్చాడు. దీంతో.. ఆర్సీబీ 200 పరుగుల మార్క్ని అందుకోలేకపోయింది. 181 పరుగులతోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!