RCB vs KKR: కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓడిన ఆర్సీబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Challengers Bangalore Lost The Match By 21 Runs Against Kolkata Knight Riders: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం చవిచూసింది. కేకేఆర్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆ లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. 179 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. కేకేఆర్ జట్టు 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే అర్థశతకంతో రాణించగా.. మిగతా వాళ్లందరూ చేతులెత్తేశారు. కొంతలో కొంత లామ్రోర్ పర్వాలేదనిపించాడంతే! స్టార్ బ్యాటర్లు సహా మిడిలార్డర్ కూడా చెత్త ప్రదర్శన కనబర్చడంతో.. ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.

Also Read
- Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
- 2011 World Cup Final: 2011 వరల్డ్ కప్ ఫైనల్ సిక్స్.. ధోనీ సీక్రెట్ బయటపెట్టిన శ్రీలంక బౌలర్..
- IPL 2027: ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి లక్నో సూపర్ జెయింట్స్.. ఎవరూ ఊహించని కెప్టెన్..
- Team India-BCCI: టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!
IPL Low Scores: ఐపీఎల్ చరిత్రలో నమోదైన 10 అత్యల్ప స్కోర్లు
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (56) అర్థశతకంతో రాణించడం.. కెప్టెన్ నితీశ్ రానా (48) మెరుపు ఇన్నింగ్స్ ఆడటం.. చివర్లో రింకూ సింగ్ (18), డేవిడ్ వీస్ (12) విజృంభించడం.. కేకేఆర్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. మొదట్లో విధ్వంసం సృష్టించింది. తొలి రెండు ఓవర్లలో 30 పరుగులు చేసింది. ఓవైపు డు ప్లెసిస్, మరోవైపు విరాట్ కోహ్లీ ఆ రెండు ఓవర్లలో ఎడాపెడా షాట్లతో చెలరేగారు. అది చూసి.. ఆర్సీబీ అత్యంత సునాయాసంగా 201 పరుగుల లక్ష్యాన్ని ఛేధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఆర్సీబీకి పెద్ద ఝలక్ తగిలింది. 31 పరుగుల వద్ద ఓ భారీ షాట్ కొట్టబోయి.. డు ప్లెసిస్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే షాబాజ్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. నేను కూడా నీ వెంటే వస్తానంటూ.. మ్యాక్స్వెల్ కూడా పెవిలియన్ చేరాడు.
Operation Kaveri: సూడాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 360 మంది భారతీయులు..
అప్పుడు లామ్రోర్తో కలిసి విరాట్ కోహ్లీ తన జట్టుని ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడుతూనే.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. అతనితో పాటు లామ్రోర్ సైతం మెరుపులు మెరిపించాడు. వీళ్లిద్దరు కలిసి నాలుగో వికెట్కి 55 పరుగులు జోడించారు. వీళ్ల ఆటతీరు చూసి.. చివరి దాకా ఇన్నింగ్స్ లాక్కొస్తారని, వీళ్లే జట్టుని గెలిపిస్తారనే ఆశలు ఆర్సీబీ అభిమానుల్లో చిగురించాయి. కానీ.. అంతలోనే ఆ ఆశలు ఆవిరైపోయాయి. లామ్రోర్ ఔటైన కొన్ని నిమిషాల్లోనే విరాట్ కోహ్లీ కూడా పోయాడు. అప్పటికే ఓటమి దాదాపు ఖరారైంది. దినేశ్ కార్తిక్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడా? అని అనుకుంటే.. ఈసారి కూడా నిరాశపరిచాడు. ఇక చివర్లో వచ్చే బ్యాటర్ల పరిస్థితి ఏంటో తెలిసిందేగా!
తాజావార్తలు
-
Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
-
Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
-
Prashant Kishor: బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. ప్రభుత్వానికి, ఆర్జేడీకి కొత్త తలనొప్పి..!
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!