Jasprit Bumrah: ‘రిస్క్ తీసుకోలేం’.. బుమ్రా రీఎంట్రీపై రోహిత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ప్రస్తుతం టీ20 సిరీస్పై దృష్టిపెట్టింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు కివీస్ను ఎదుర్కొనేందుకు రెడీ అయింది. ఈ టీ20 సిరీస్ ముగిసన తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగబోతుంది. వచ్చే నెల నుంచి ఆరంభం కానున్న ఈ సిరీస్కు సంబంధించి ఇప్పటికే జట్టను కూడా ప్రకటించారు. అయితే జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కైనా అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయమై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బుమ్రా గాయంపై రిస్క్ తీసుకోలేమని.. చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులో ఉంటాడని తాము ఆశిస్తున్నట్లు స్పష్టం చేశాడు.
Zomato Gold: జొమాటో కస్టమర్లకు గుడ్ న్యూస్.. డిస్కౌంట్స్ బొనాంజా మళ్లీ వచ్చేసింది
Also Read
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
- Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
- Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు నమ్మకం లేదు.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
“బుమ్రా గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్లో చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నా. వెన్ను గాయం కారణంగా మేము అతడి ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేం. అతడు ఇంకా ఎంతో రాణించాల్సి ఉంది. బుమ్రా ఆరోగ్యం గురించి నేషనల్ క్రికెట్ అకాడమీలోని ఫిజియో, వైద్యులతో నిరంతరం టచ్లో ఉంటూనే ఉన్నాం. డాక్టర్లు అతడికి కావాల్సినంత సమయాన్ని ఇస్తూ కమ్బ్యాక్ కోసం ఫిట్నెస్ సాధించేలా కృషి చేస్తున్నారు” అని రోహిత్ వెల్లడించాడు.
Fact Check: బాలయ్య పేరుతో ఫేక్ లెటర్.. మండిపడుతున్న నందమూరి అభిమానులు
గతేడాది ఇంగ్లాండ్ పర్యటన తర్వాత బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్నకు కూడా దూరమయ్యాడు. శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్తోనే పునరాగమనం చేయాల్సి ఉండగా గాయం తిరగబెట్టడంతో అది సాధ్యం కాలేదు. దీంతో అతడు మళ్లీ ఎన్సీఏకి వెళ్లాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2022లో బోర్డర్-గవాస్కర్ ట్రోపీ కీలకం కావడంతో బుమ్రా రాక కోసం టీమ్ మేనేజ్మెంట్తో పాటు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 9న నాగ్పుర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆరంభం కానుంది. చివరి రెండు టెస్టులు మార్చి మొదటి, రెండు వారాల్లో జరగనున్నాయి.
తాజావార్తలు
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!