Jasprit Bumrah: ‘రిస్క్ తీసుకోలేం’.. బుమ్రా రీఎంట్రీపై రోహిత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ప్రస్తుతం టీ20 సిరీస్పై దృష్టిపెట్టింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు కివీస్ను ఎదుర్కొనేందుకు రెడీ అయింది. ఈ టీ20 సిరీస్ ముగిసన తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగబోతుంది. వచ్చే నెల నుంచి ఆరంభం కానున్న ఈ సిరీస్కు సంబంధించి ఇప్పటికే జట్టను కూడా ప్రకటించారు. అయితే జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కైనా అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయమై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బుమ్రా గాయంపై రిస్క్ తీసుకోలేమని.. చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులో ఉంటాడని తాము ఆశిస్తున్నట్లు స్పష్టం చేశాడు.
Zomato Gold: జొమాటో కస్టమర్లకు గుడ్ న్యూస్.. డిస్కౌంట్స్ బొనాంజా మళ్లీ వచ్చేసింది
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Zim vs Ban: 'ఇన్నోసెంట్ కైయా' సెంచరీ.. బంగ్లాదేశ్పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
- IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
“బుమ్రా గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్లో చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నా. వెన్ను గాయం కారణంగా మేము అతడి ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేం. అతడు ఇంకా ఎంతో రాణించాల్సి ఉంది. బుమ్రా ఆరోగ్యం గురించి నేషనల్ క్రికెట్ అకాడమీలోని ఫిజియో, వైద్యులతో నిరంతరం టచ్లో ఉంటూనే ఉన్నాం. డాక్టర్లు అతడికి కావాల్సినంత సమయాన్ని ఇస్తూ కమ్బ్యాక్ కోసం ఫిట్నెస్ సాధించేలా కృషి చేస్తున్నారు” అని రోహిత్ వెల్లడించాడు.
Fact Check: బాలయ్య పేరుతో ఫేక్ లెటర్.. మండిపడుతున్న నందమూరి అభిమానులు
గతేడాది ఇంగ్లాండ్ పర్యటన తర్వాత బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్నకు కూడా దూరమయ్యాడు. శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్తోనే పునరాగమనం చేయాల్సి ఉండగా గాయం తిరగబెట్టడంతో అది సాధ్యం కాలేదు. దీంతో అతడు మళ్లీ ఎన్సీఏకి వెళ్లాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2022లో బోర్డర్-గవాస్కర్ ట్రోపీ కీలకం కావడంతో బుమ్రా రాక కోసం టీమ్ మేనేజ్మెంట్తో పాటు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 9న నాగ్పుర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆరంభం కానుంది. చివరి రెండు టెస్టులు మార్చి మొదటి, రెండు వారాల్లో జరగనున్నాయి.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!