న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 లో నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్ లో విజయం సాధించి…. సిరీస్ ను వైట్ వాష్ చేసింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ లో 31 బంతుల్లో 56 పరుగులతో అర్ధశతకం చేసిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ టీ20 కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఇన్ని రోజులు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో అత్యధికంగా హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉండేది. విరాట్ కోహ్లీ 95 మ్యాచ్ లలో మొత్తం 29 హాఫ్ సెంచరీలు చేసాడు. కానీ నిన్నటి మ్యాచ్ లో చేసిన అర్ధశతకంతో ఆ రికార్డు ను హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు. ఈ మూడో మ్యాచ్ లో రోహిత్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో తన 30వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ రికార్డు ను రోహిత్ 119 మ్యాచ్ లలో నెలకొల్పాడు.