Cricket : వారం రోజుల వరకు ధోని నిద్రపోయేవాడు కాదు.. అసలు విషయం చెప్పిన ఊతప్ప
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ కు తొలి ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యులుగా ఉన్న ఎంఎస్ ధోని, రాబిన్ ఊతప్పలు మంచి స్నేహితులు. భారత జట్టుతో పాటు ఐపీఎల్ లో కూడా ఇద్దరు కలిసి ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ఊతప్ప గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆటకు రిటైర్మింట్ ప్రకటించారు. రాబోయే సీజన్ లో ఊతప్ప ఐపీఎల్ కామెంటేటర్ అవతారం ఎత్తనున్నారు. జియో సినిమాస్ ద్వారా ప్రసారం కాబోతున్న ఐపీఎల్-16 ఊతప్ప కామెంటేటర్ గా చేస్తాడని హింట్స్ కూడా వచ్చాయి. తాజాగా అతడు జియో సినమాస్ లో జరిగిన చర్చలో సారథి ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Also Read : Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్
Also Read
- VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ఎంఎస్ ధోనీవి పదునైన వ్యూహాలు కలిగి ఉంటాడు.. అందుకే అతడిని అందరూ సక్సెస్ పుల్ కెప్టెన్ అంటారని ఊతప్ప అన్నారు. తన నుంచి వచ్చే ప్రతి నిర్ణయానికి అతడే బాధత్య వహిస్తాడని చెప్పాడు. అది విజయమైనా.. పరాజయమైనా ధోనినే పూర్తి బాధ్యత తీసుకునే వాడని తెలిపాడు. ఒకవేళ ధోని నిర్ణయం వల్ల ఫలితం ఏదైనా తేడా వస్తే అతడికి నిద్ర పట్టదు.. దానిమీదే ఆలోచిస్తూ గడుపుతుంటాడు.. ఒక విజయవంతమైన కెప్టెన్ తన తప్పుడు నిర్ణయాలపై నాలుగైదు సార్లు ఆలోచిస్తాడనుకుంటే ధోని మాత్రం.. కనీసం 8 నుంచి 9 సార్లు ఉంటుంది. అంత ఆలోస్తాడు కాబట్టే అతడు సక్సెస్ పుల్ సారథి అయ్యాడు.. అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.
Also Read : Asaduddin Owaisi: సీఎం వల్లే ఆర్జేడీలోకి మా ఎమ్మెల్యేలు.. ఈ సారి ఎక్కువ స్థానాల్లో పోటీ..
కాగా మార్చ్ 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 16 సీజన్ కోసం ప్రస్తుతం చెన్నైలో ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అతనికి ఇదే చివరి సీజన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గతేడాదే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాలని ధోని భావించినా పరిస్థితులు అందుకు అనుకూలించలేదు.. గత సీజన్ లో చెన్నై దారుణ ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈసారి తిరిగి పుంజుకోవాలని ధోని పట్టుదలతో ఉన్నాడు. తన చివరి మ్యాచ్ చెపాక్ (చెన్నై) లోనే ఆడతానని ధోని ఇది వరకే ప్రకటించారు. ఐపీఎల్ -16 చెన్నై తమ తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ తో తలపడనుంది.
- Tags
- cricket
- CSK
- dhoni
- IPL 2023
- Robin Uthappa
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!