Nitish Kumar: ‘మీరే తాగుబోతులు, మధ్య నిషేధంపై మాట్లాడేది మీరా?’.. బీజేపీ ఎమ్మెల్యేలపై సీఎం నితీష్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. 2016 నుంచి రాష్ట్రంలో మద్యం మరణాలపై అసెంబ్లీలో బుధవారం ప్రశ్నించిన బీజేపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. ‘మీరే తాగుబోతులు.. మద్య నిషేధం గురించి మీరా మాట్లాడేది?’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అయితే నినాదాలు చేస్తున్న వారిపై సీఎం నితీశ్ కుమార్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం జరిగింది? నిశ్శబ్దంగా ఉండండి. వారిని సభ నుంచి బయటకు పంపండి’ అని సభను ఉద్దేశించి అన్నారు.
India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్
Also Read
సరణ్ జిల్లాలోని ఛప్రాలో నకిలీ మద్యం తాగి పలువురు మరణించారు. మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. ఈ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. కారణాన్ని ఇంకా కనుగొనలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడైన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా, బీహార్ రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్య నిషేధంపై అసెంబ్లీలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ సహనం కోల్పోయారు. ‘మద్య నిషేధం గురించి మీరా మాట్లాడేది.. మీరే పెద్ద తాగుబోతులు’ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష బీజేపీ ఎమ్మెల్యే మండిపడుతున్నారు. బీహార్ అసెంబ్లీలో ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ తీవ్రంగా స్పందించారు. నితీష్ కాలం ముగిసిందని అన్నారు. ఆయన తరచుగా సహనం కోల్పోతున్నారని.. సీఎం వైఖరి సరిగా లేదని ఆయన పేర్కొన్నారు.
#WATCH | Bihar CM Nitish Kumar loses his temper in State Assembly as LoP Vijay Kumar Sinha questions the state govt's liquor ban in wake of deaths that happened due to spurious liquor in Chapra. pic.twitter.com/QE4MklfDC6
— ANI (@ANI) December 14, 2022
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!