India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్
India-China Clash Video: అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వం ధృవీకరించిన ఒక రోజు అనంతరం.. అంతకుముందు జరిగిన ఘర్షణకు సంబంధించిన తేదీ లేని వీడియో వైరల్గా మారింది. ఆ వీడియో బహుశా గత సంవత్సరం, అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన భీకర పోరు అని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో డిసెంబర్ 9 ఘటనకు సంబంధించినది కాదని ఆర్మీ గట్టిగా ఖండించింది.
2020 జూన్లో తూర్పు లడఖ్లోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో దేశం కోసం 20 మంది భారతీయ సైనికులు మరణించారు. 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. చైనా సైనికులు భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా.. భారత సైనికులు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. ఈ వీడియో ఎల్ఏసీని దాటడానికి ప్రయత్నిస్తున్న చైనా సైనికులతో భారత సైనికులు హింసాత్మకంగా ఘర్షణ పడుతున్నారు. “వాళ్ళను గట్టిగా కొట్టండి, వారు తిరిగి రారు” అని జవాన్లు పంజాబీలో చెప్పడం వినబడుతుంది. భారతీయ సైనికులు చైనా సైనికులను లాఠీలతో కొట్టడం, చైనీయులు ముందుకు రాకుండా విజయవంతంగా ఆపగలిగారు. గత వారం జరిగిన సంఘటన బహిర్గతం కావడంతో వివిధ రాజకీయ నేతలు ఈ వీడియోను షేర్ చేశారు.
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
నిన్న పార్లమెంటులో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిసెంబర్ 9న అదే ప్రాంతంలో భూసేకరణకు చైనా చేసిన ప్రయత్నాన్ని ధృవీకరించారు. ఇరుపక్షాల మధ్య భౌతిక ఘర్షణ జరిగింది. భారత సైనికులు వీరోచితంగా పోరాడి చైనా సైనికులను వెనక్కి పంపించారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇరుదేశాల సైనికులకు గాయాలయ్యాయని ఆయన తెలిపారు. చైనీస్ దళాలు యాంగ్ట్సే, తవాంగ్లో ఎల్ఏసీని అతిక్రమించడానికి ప్రయత్నించాయని వెల్లడించారు. భారత సైనిక కమాండర్లు సకాలంలా జోక్యం చేసుకోగా.. చైనా సైనికులు తిరిగి తమ స్థానాలకు వెళ్లారన్నారు. కమాండర్ల సమావేశంలో చైనీయులు ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని, సరిహద్దులో శాంతి, ప్రశాంతతను కాపాడాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఘర్షణపై స్పందించని చైనా.. సరిహద్దు వద్ద పరిస్థితి సాధారణంగా ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!