India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China Clash Video: అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వం ధృవీకరించిన ఒక రోజు అనంతరం.. అంతకుముందు జరిగిన ఘర్షణకు సంబంధించిన తేదీ లేని వీడియో వైరల్గా మారింది. ఆ వీడియో బహుశా గత సంవత్సరం, అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన భీకర పోరు అని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో డిసెంబర్ 9 ఘటనకు సంబంధించినది కాదని ఆర్మీ గట్టిగా ఖండించింది.
2020 జూన్లో తూర్పు లడఖ్లోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో దేశం కోసం 20 మంది భారతీయ సైనికులు మరణించారు. 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. చైనా సైనికులు భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా.. భారత సైనికులు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. ఈ వీడియో ఎల్ఏసీని దాటడానికి ప్రయత్నిస్తున్న చైనా సైనికులతో భారత సైనికులు హింసాత్మకంగా ఘర్షణ పడుతున్నారు. “వాళ్ళను గట్టిగా కొట్టండి, వారు తిరిగి రారు” అని జవాన్లు పంజాబీలో చెప్పడం వినబడుతుంది. భారతీయ సైనికులు చైనా సైనికులను లాఠీలతో కొట్టడం, చైనీయులు ముందుకు రాకుండా విజయవంతంగా ఆపగలిగారు. గత వారం జరిగిన సంఘటన బహిర్గతం కావడంతో వివిధ రాజకీయ నేతలు ఈ వీడియోను షేర్ చేశారు.
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
నిన్న పార్లమెంటులో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిసెంబర్ 9న అదే ప్రాంతంలో భూసేకరణకు చైనా చేసిన ప్రయత్నాన్ని ధృవీకరించారు. ఇరుపక్షాల మధ్య భౌతిక ఘర్షణ జరిగింది. భారత సైనికులు వీరోచితంగా పోరాడి చైనా సైనికులను వెనక్కి పంపించారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇరుదేశాల సైనికులకు గాయాలయ్యాయని ఆయన తెలిపారు. చైనీస్ దళాలు యాంగ్ట్సే, తవాంగ్లో ఎల్ఏసీని అతిక్రమించడానికి ప్రయత్నించాయని వెల్లడించారు. భారత సైనిక కమాండర్లు సకాలంలా జోక్యం చేసుకోగా.. చైనా సైనికులు తిరిగి తమ స్థానాలకు వెళ్లారన్నారు. కమాండర్ల సమావేశంలో చైనీయులు ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని, సరిహద్దులో శాంతి, ప్రశాంతతను కాపాడాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఘర్షణపై స్పందించని చైనా.. సరిహద్దు వద్ద పరిస్థితి సాధారణంగా ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!