Rohit- Kohli Retirement: త్వరలోనే వన్డేలకు రోహిత్, కోహ్లీ వీడ్కోలు.. ఎవరెప్పుడు రిటైర్ అవుతారో మీకెందుకు..?
- త్వరలోనే వన్డేలకు రోహిత్, కోహ్లీ వీడ్కోలు..
- రూమర్స్పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఫైర్..
- ఎవరెప్పుడు రిటైర్ అవుతారో మీకెందుకు?: బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit- Kohli Retirement: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జోరుగా జరుగుతోంది. వీరిద్దరూ త్వరలో వన్డేలకు కూడా వీడ్కోలు చెబుతారన్న రూమర్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వారికి గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలనే చర్చలు ఊపందుకోవడంతో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: OG: పవన్ – ప్రియాంక మెలోడీ సాంగ్ రిలీజ్ డేట్ లాక్! ఫ్యాన్స్ ఊహించని సర్ప్రైజ్
Also Read
- Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
- Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
- SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
- బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
అసత్య ప్రచారంపై ఆగ్రహం
సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు శుక్లా పేర్కొన్నారు. ఇప్పటికే రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పారు.. కానీ, వన్డేల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం రోహిత్, విరాట్ సిద్ధమవుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శుక్లాను.. సచిన్లా రోహిత్, విరాట్కి ఫేర్వెల్ ఇస్తారా? అని హోస్ట్ ప్రశ్నించగా, ఆయన ఈ ఘాటుగా స్పందించారు.
Read Also: Kotamreddy Sridhar Reddy: మానవత్వంతో శ్రీకాంత్కి పెరోల్ లేఖ.. వేరే ఉద్దేశ్యం లేదు..
ఎందుకు ఇంత కంగారు?
ఇక, రోహిత్ శర్మ, విరాట్ కేవలం వన్డేల్లో కొనసాగుతున్న సమయంలో ఫేర్వెల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని రాజీవ్ శుక్లా అడిగారు. మీలాంటి వారు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బీసీసీఐ ఎవరినీ రిటైర్ అవ్వమని చెప్పదు.. మా పాలసీ క్లియర్ గా ఉంటుంది.. ఏ ఆటగాడైనా తన సొంత నిర్ణయం తీసుకుంటాడు.. ఆ నిర్ణయాన్ని తాము గౌరవించాల్సిందే అని శుక్లా స్పష్టం చేశారు.
ఫామ్లోనే ఉన్న రోహిత్–కోహ్లీ
కాగా, విరాట్ కోహ్లీ ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడు.. రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాంటప్పుడు సోషల్ మీడియాలో వారి ఫేర్వెల్ గురించి ఎందుకు అడుగుతున్నారు? అని ఘాటుగా మండిపడ్డిరు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఆపేయాలని కోరారు. శుక్లా వ్యాఖ్యలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే రిటైర్మెంట్ రూమర్స్కు పూర్తి స్టాప్ పడినట్లే అని చెప్పాలి.
https://twitter.com/45__rohan/status/1958929636626505806
తాజావార్తలు
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!