Rohit- Kohli Retirement: త్వరలోనే వన్డేలకు రోహిత్, కోహ్లీ వీడ్కోలు.. ఎవరెప్పుడు రిటైర్ అవుతారో మీకెందుకు..?
- త్వరలోనే వన్డేలకు రోహిత్, కోహ్లీ వీడ్కోలు..
- రూమర్స్పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఫైర్..
- ఎవరెప్పుడు రిటైర్ అవుతారో మీకెందుకు?: బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit- Kohli Retirement: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జోరుగా జరుగుతోంది. వీరిద్దరూ త్వరలో వన్డేలకు కూడా వీడ్కోలు చెబుతారన్న రూమర్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వారికి గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలనే చర్చలు ఊపందుకోవడంతో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: OG: పవన్ – ప్రియాంక మెలోడీ సాంగ్ రిలీజ్ డేట్ లాక్! ఫ్యాన్స్ ఊహించని సర్ప్రైజ్
Also Read
- Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
- Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
- Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
- IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
అసత్య ప్రచారంపై ఆగ్రహం
సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు శుక్లా పేర్కొన్నారు. ఇప్పటికే రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పారు.. కానీ, వన్డేల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం రోహిత్, విరాట్ సిద్ధమవుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శుక్లాను.. సచిన్లా రోహిత్, విరాట్కి ఫేర్వెల్ ఇస్తారా? అని హోస్ట్ ప్రశ్నించగా, ఆయన ఈ ఘాటుగా స్పందించారు.
Read Also: Kotamreddy Sridhar Reddy: మానవత్వంతో శ్రీకాంత్కి పెరోల్ లేఖ.. వేరే ఉద్దేశ్యం లేదు..
ఎందుకు ఇంత కంగారు?
ఇక, రోహిత్ శర్మ, విరాట్ కేవలం వన్డేల్లో కొనసాగుతున్న సమయంలో ఫేర్వెల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని రాజీవ్ శుక్లా అడిగారు. మీలాంటి వారు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బీసీసీఐ ఎవరినీ రిటైర్ అవ్వమని చెప్పదు.. మా పాలసీ క్లియర్ గా ఉంటుంది.. ఏ ఆటగాడైనా తన సొంత నిర్ణయం తీసుకుంటాడు.. ఆ నిర్ణయాన్ని తాము గౌరవించాల్సిందే అని శుక్లా స్పష్టం చేశారు.
ఫామ్లోనే ఉన్న రోహిత్–కోహ్లీ
కాగా, విరాట్ కోహ్లీ ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడు.. రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాంటప్పుడు సోషల్ మీడియాలో వారి ఫేర్వెల్ గురించి ఎందుకు అడుగుతున్నారు? అని ఘాటుగా మండిపడ్డిరు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఆపేయాలని కోరారు. శుక్లా వ్యాఖ్యలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే రిటైర్మెంట్ రూమర్స్కు పూర్తి స్టాప్ పడినట్లే అని చెప్పాలి.
https://twitter.com/45__rohan/status/1958929636626505806
తాజావార్తలు
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!