Kotamreddy Sridhar Reddy: మానవత్వంతో శ్రీకాంత్కి పెరోల్ లేఖ.. వేరే ఉద్దేశ్యం లేదు..
- శ్రీకాంత్ పెరోల్ కోసం నేను, ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన లేఖలను హోంశాఖ తిరస్కరించింది..
- జూలై 16న మా లేఖలు తిరస్కరించబడినట్లు అధికారులు రాతపూర్వకంగా తెలియజేశారు..
- కానీ, జూలై 30న రౌడీ షీటర్ శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేశారు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotamreddy Sridhar Reddy: రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైసీపీ రూరల్ ఇంచార్జ్, సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి నా దగ్గరకి వస్తే సిఫార్సు లేఖ ఇచ్చాను.. వివిధ సమస్యల్లో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారు.. అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారు.. జూలై 16వ తేదీన నేను, గూడూరు ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన లేఖను తిరస్కరిస్తూ అధికారులు మా ఇద్దరికీ రాత పూర్వక సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, జులై 30న అధికారులు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేశారు. 16న మా లేఖలని తిరస్కరించి 14 రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేశారు.. దీనిపై విచారిస్తున్నామని హోంశాఖ మంత్రి అనిత చెప్పారని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Manisha Koirala : రిలేషన్లే నా జీవితాన్ని నాశనం చేసాయి: మనీషా కోయిరాలా
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
అయితే, పెరోల్ లేఖలు ఇవ్వడమే తప్పని వైసీపీ అంటోంది.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు ఇదే శ్రీకాంత్ కి లేఖలు ఎలా ఇచ్చారని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఆ లేఖల ఆధారంగా శ్రీకాంత్ కి అప్పట్లో పెరోల్ కూడా ఇచ్చారని తెలిపారు. ఇకపై నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవ్వరికీ పెరోల్ విషయంలో లేఖలు ఇవ్వను.. అధికారానికి 16 నెలల ముందే నేను గత ముఖ్యమంత్రి జగన్ ని వ్యతిరేకించి బయటకు వచ్చా.. నేను దందాలు చేసి ఉంటే వైసీపీలో ఉన్నప్పుడు నా మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్ లో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తని అయినా వేధించామా, దాడులు చేశామా.. వారిపై నేను ప్రతీకారం తీర్చుకోవాలంటే చుక్కలు చూపించేవాడినని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!