Kotamreddy Sridhar Reddy: మానవత్వంతో శ్రీకాంత్కి పెరోల్ లేఖ.. వేరే ఉద్దేశ్యం లేదు..
- శ్రీకాంత్ పెరోల్ కోసం నేను, ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన లేఖలను హోంశాఖ తిరస్కరించింది..
- జూలై 16న మా లేఖలు తిరస్కరించబడినట్లు అధికారులు రాతపూర్వకంగా తెలియజేశారు..
- కానీ, జూలై 30న రౌడీ షీటర్ శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేశారు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotamreddy Sridhar Reddy: రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైసీపీ రూరల్ ఇంచార్జ్, సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి నా దగ్గరకి వస్తే సిఫార్సు లేఖ ఇచ్చాను.. వివిధ సమస్యల్లో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారు.. అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారు.. జూలై 16వ తేదీన నేను, గూడూరు ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన లేఖను తిరస్కరిస్తూ అధికారులు మా ఇద్దరికీ రాత పూర్వక సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, జులై 30న అధికారులు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేశారు. 16న మా లేఖలని తిరస్కరించి 14 రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేశారు.. దీనిపై విచారిస్తున్నామని హోంశాఖ మంత్రి అనిత చెప్పారని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Manisha Koirala : రిలేషన్లే నా జీవితాన్ని నాశనం చేసాయి: మనీషా కోయిరాలా
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
అయితే, పెరోల్ లేఖలు ఇవ్వడమే తప్పని వైసీపీ అంటోంది.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు ఇదే శ్రీకాంత్ కి లేఖలు ఎలా ఇచ్చారని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఆ లేఖల ఆధారంగా శ్రీకాంత్ కి అప్పట్లో పెరోల్ కూడా ఇచ్చారని తెలిపారు. ఇకపై నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవ్వరికీ పెరోల్ విషయంలో లేఖలు ఇవ్వను.. అధికారానికి 16 నెలల ముందే నేను గత ముఖ్యమంత్రి జగన్ ని వ్యతిరేకించి బయటకు వచ్చా.. నేను దందాలు చేసి ఉంటే వైసీపీలో ఉన్నప్పుడు నా మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్ లో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తని అయినా వేధించామా, దాడులు చేశామా.. వారిపై నేను ప్రతీకారం తీర్చుకోవాలంటే చుక్కలు చూపించేవాడినని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!