RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!
- డేవిడ్ విధ్వంసంతో 250 పరుగుల పర్వతం
- పడిక్కల్, పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్
- భువనేశ్వర్ 200 వికెట్ల రికార్డు
- చెన్నైపై 43 పరుగుల భారీ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ చరిత్రలో అత్యంత క్రేజ్ ఉన్న ఆర్సీబీ-సీఎస్కే పోరులో ఈసారి బెంగళూరుదే పైచేయి అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సాక్షిగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా, భారీ లక్ష్య ఛేదనలో చెన్నై తడబడింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250/3 పరుగుల భారీ స్కోరు సాధించి, ఈ సీజన్లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది.
Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్
Also Read
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
- India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
ఆర్సీబీ ఇన్నింగ్స్లో టిమ్ డేవిడ్ అసలైన విధ్వంసాన్ని సృష్టించాడు. కేవలం 25 బంతుల్లో 8 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో డేవిడ్ 4 సిక్సర్లు, ఒక ఫోర్తో ఏకంగా 30 పరుగులు పిండుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ రజత్ పాటిదార్ 19 బంతుల్లోనే 48 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (28), ఫిల్ సాల్ట్ (46) జట్టుకు బలమైన పునాది వేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు వైపు సాగింది. చెన్నై బౌలర్లు చిన్నస్వామి పిచ్పై తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ భారీగా పరుగులు సమర్పించుకోగా, శివం దూబే ఒక వికెట్ పడగొట్టాడు.
251 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ తన మొదటి ఓవర్లోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7)ను అవుట్ చేయగా, మరోవైపు భువనేశ్వర్ కుమార్ ఆయుష్ మాత్రే (1)ను పెవిలియన్ పంపి ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన మొదటి పేసర్గా చరిత్ర సృష్టించాడు. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ (9) కూడా నిరాశపరచడంతో చెన్నై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే క్రీజులో పాతుకుపోయిన అతడిని కృనాల్ పాండ్యా స్టంపింగ్ ద్వారా అవుట్ చేయడంతో చెన్నై ఆశలు ఆవిరయ్యాయి.
చివర్లో శివం దూబే (18), జేమీ ఓవర్టన్ (37), ప్రశాంత్ వీర్ (43) పోరాడినప్పటికీ అవి ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఆర్సీబీ బౌలర్లు అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెన్నైని 207 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ సమిష్టిగా రాణించి చెన్నై బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టింది. మొత్తానికి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బ్యాటర్లు చూపిన తెగివూ, బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన వారికి 43 పరుగుల అద్భుత విజయాన్ని అందించింది.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!