RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!
- డేవిడ్ విధ్వంసంతో 250 పరుగుల పర్వతం
- పడిక్కల్, పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్
- భువనేశ్వర్ 200 వికెట్ల రికార్డు
- చెన్నైపై 43 పరుగుల భారీ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ చరిత్రలో అత్యంత క్రేజ్ ఉన్న ఆర్సీబీ-సీఎస్కే పోరులో ఈసారి బెంగళూరుదే పైచేయి అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సాక్షిగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా, భారీ లక్ష్య ఛేదనలో చెన్నై తడబడింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250/3 పరుగుల భారీ స్కోరు సాధించి, ఈ సీజన్లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది.
Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్
Also Read
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
- Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
- Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
ఆర్సీబీ ఇన్నింగ్స్లో టిమ్ డేవిడ్ అసలైన విధ్వంసాన్ని సృష్టించాడు. కేవలం 25 బంతుల్లో 8 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో డేవిడ్ 4 సిక్సర్లు, ఒక ఫోర్తో ఏకంగా 30 పరుగులు పిండుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ రజత్ పాటిదార్ 19 బంతుల్లోనే 48 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (28), ఫిల్ సాల్ట్ (46) జట్టుకు బలమైన పునాది వేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు వైపు సాగింది. చెన్నై బౌలర్లు చిన్నస్వామి పిచ్పై తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ భారీగా పరుగులు సమర్పించుకోగా, శివం దూబే ఒక వికెట్ పడగొట్టాడు.
251 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ తన మొదటి ఓవర్లోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7)ను అవుట్ చేయగా, మరోవైపు భువనేశ్వర్ కుమార్ ఆయుష్ మాత్రే (1)ను పెవిలియన్ పంపి ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన మొదటి పేసర్గా చరిత్ర సృష్టించాడు. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ (9) కూడా నిరాశపరచడంతో చెన్నై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే క్రీజులో పాతుకుపోయిన అతడిని కృనాల్ పాండ్యా స్టంపింగ్ ద్వారా అవుట్ చేయడంతో చెన్నై ఆశలు ఆవిరయ్యాయి.
చివర్లో శివం దూబే (18), జేమీ ఓవర్టన్ (37), ప్రశాంత్ వీర్ (43) పోరాడినప్పటికీ అవి ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఆర్సీబీ బౌలర్లు అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెన్నైని 207 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ సమిష్టిగా రాణించి చెన్నై బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టింది. మొత్తానికి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బ్యాటర్లు చూపిన తెగివూ, బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన వారికి 43 పరుగుల అద్భుత విజయాన్ని అందించింది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!